మరణశిక్షను సవాల్‌ చేసిన భారతీయ ఖైదీలు

- July 28, 2016 , by Maagulf
మరణశిక్షను సవాల్‌ చేసిన భారతీయ ఖైదీలు

మరణ శిక్ష పడ్డ ఇద్దరు ఖైదీలు ఖతార్‌ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేశారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వీరు ఖతార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది జనవరిలో ముగ్గురు భారతీయులు సుబ్రమణియన్‌, అలగప్ప, శివకుమార్‌ అర్చునమ్‌, చిల్లాదురై పెరుమాల్‌ ఓ మహిళను చంపిన కేసులో దోషులుగా తేలారు. ఎంబసీ సహాయంతో వీరు కింది కోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. కింది కోర్టు ఈ ముగ్గురిలో ఒకరికి యావజ్జీవ కారాగారశిక్ష, మరో ఇద్దరికి మరణ శిక్ష విధించింది. ఎక్సటర్నల్‌ ఎఫైర్స్‌ మినిస్ట్రీ అధికార ప్రతినిథి వికాస్‌ స్వరూప్‌ మాట్లాడుతూ, ఫిబ్రవరి 212లో ఈ ముగ్గురూ ఓ హత్య కేసులో అరెస్టయ్యారని తెలిపారు. ఎమిరి లేదా రాయల్‌ పార్డన్‌ కోసం వీరు ఎంబసీ ద్వారా ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com