అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- January 25, 2026
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ మంచి మనసును చాటుకున్నారు. తమిళనాడులోని మధురైలో శేఖర్ అనే వ్యక్తి.. పరోటా షాప్ నడుపుతున్నాడు. గత 13 ఏళ్ల నుంచి కేవలం 5 రుపాయలకే పరోటా అమ్ముతున్నాడు. గతంలో ఇతడికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇతని పేరు శేఖర్ అయినప్పటికీ అందరూ రజనీకాంత్ శేఖర్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇతను సూపర్ స్టార్ కు వీరాభిమాని. ఈ క్రమంలోనే తాజాగా రజనీ నుంచి శేఖర్ కుటుంబానికి పిలుపు వచ్చింది. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా శేఖర్ ను ఇంటికి ఆహ్వానించిన రజనీకాంత్.. అతనికి బంగారు చెయిన్ బహుమతిగా ఇచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే, రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ చిత్రం పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు, తన తదుపరి చిత్రం గురించిన కీలక అప్డేట్ను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే పొంగల్ పండుగ సందర్భంగా తన ఇంటి వద్దకు వచ్చిన అభిమానులతో మాట్లాడుతూ, సిబి చక్రవర్తి దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభమవుతుందని స్వయంగా వెల్లడించారు. ఇది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







