పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- January 25, 2026
న్యూ ఢిల్లీ: నేడు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అన్ని రంగాలలో కలిపి ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. ఇందులో సినిమా రంగం నుంచి కూడా పలువురు ఈ అవార్డులు సాధించారు.
గత సంవత్సరం నవంబర్ లో బాలీవుడ్ స్టార్ నటుడు ధర్మేంద్ర డియోల్ మరణించిన సంగతి తెలిసిందే. మరణానంతరం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు.
మలయాళం స్టార్ హీరో మమ్ముట్టికి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారు.
బాలీవుడ్ సీనియర్ సింగర్ అల్కా యాగ్నిక్ కు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారు.
తెలుగులో రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్ లకు పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.
తమిళ్, తెలుగు, బాలీవుడ్ సినిమాలలో మెప్పించిన ఒకప్పటి స్టార్ హీరో మాధవన్ కి కూడా పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.బాలీవుడ్ కి చెందిన నటుడు అరవింద్ వైద్యకు పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.బాలీవుడ్ నటుడు సతీష్ రవిలాల్ షాకు మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు.
ఉత్తర ప్రదేశ్ నటుడు అనిల్ రస్తోగికి, బెంగాల్ నటుడు, నిర్మాత ప్రోసేన్జిత్ ఛటర్జీకి పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









