పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- January 25, 2026
న్యూ ఢిల్లీ: నేడు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అన్ని రంగాలలో కలిపి ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. ఇందులో సినిమా రంగం నుంచి కూడా పలువురు ఈ అవార్డులు సాధించారు.
గత సంవత్సరం నవంబర్ లో బాలీవుడ్ స్టార్ నటుడు ధర్మేంద్ర డియోల్ మరణించిన సంగతి తెలిసిందే. మరణానంతరం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు.
మలయాళం స్టార్ హీరో మమ్ముట్టికి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారు.
బాలీవుడ్ సీనియర్ సింగర్ అల్కా యాగ్నిక్ కు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారు.
తెలుగులో రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్ లకు పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.
తమిళ్, తెలుగు, బాలీవుడ్ సినిమాలలో మెప్పించిన ఒకప్పటి స్టార్ హీరో మాధవన్ కి కూడా పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.బాలీవుడ్ కి చెందిన నటుడు అరవింద్ వైద్యకు పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.బాలీవుడ్ నటుడు సతీష్ రవిలాల్ షాకు మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు.
ఉత్తర ప్రదేశ్ నటుడు అనిల్ రస్తోగికి, బెంగాల్ నటుడు, నిర్మాత ప్రోసేన్జిత్ ఛటర్జీకి పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







