భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- January 26, 2026
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. “వందేమాతరానికి 150 ఏళ్లు” ప్రధాన ఇతివృత్తంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్లో రిపబ్లిక్ డేను నిర్వహిస్తున్నారు. వేడుకకు ముఖ్య అతిథులుగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ పాల్గొంటున్నారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారి గణంత్ర వేడుకలు జరిగాయి. ఏపీ హైకోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రి లోకేశ్, హైకోర్టు న్యాయమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలోని సికింద్రాబార్ పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







