గల్ఫ్‌ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!

- January 27, 2026 , by Maagulf
గల్ఫ్‌ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!

దుబాయ్ః యూఏఈ ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ లో జరుగుతున్న గల్ఫ్‌ఫుడ్ 2026 ప్రదర్శనను సందర్శించారు.  ఈ మేరకు కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. పెద్ద ఎత్తున అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించడానికి వీలుగా ఈ వేదికలో 10 బిలియన్ దిర్హమ్‌ల విలువైన విస్తరణ పనులు జరిగాయని ఆయన పేర్కొన్నారు.  
ఈ సంవత్సరం మొదటిసారిగా గల్ప్ ఫుడ్ ఈవెంట్‌లో కొంత భాగం ఎక్స్‌పో సిటీలోని దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్ (DEC)లో జరుగుతుండగా,  మిగిలిన భాగం దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC)లో జరుగుతుంది. ఈ ప్రదర్శనలో 195 దేశాల నుండి 8,500 కంపెనీలు పాల్గొని 1.5 మిలియన్లకు పైగా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com