చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- January 26, 2026
న్యూ ఢిల్లీ: చిరు వ్యాపారులు, వీధి వ్యాపారుల ఆర్థిక అవసరాలను తీర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.ఇప్పటికే పీఎం స్వనిధి పథకం ద్వారా రుణాలు పొందిన వ్యాపారులకు ఇప్పుడు ‘స్వనిధి క్రెడిట్ కార్డు’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రెడిట్ కార్డు ద్వారా వ్యాపారులు తక్కువ వడ్డీతో సులభంగా రుణాలు పొందే అవకాశం కలుగుతుంది.
పీఎం స్వనిధి స్కీమ్లో భాగంగా రెండో విడత రుణాన్ని తీసుకుని, సకాలంలో చెల్లించిన చిరు వ్యాపారులే ఈ క్రెడిట్ కార్డుకు అర్హులు. ఇది పూర్తిగా UPI లింక్ అయిన రూపే క్రెడిట్ కార్డు, దీంతో డిజిటల్ చెల్లింపులు మరింత సులభంగా మారనున్నాయి. ఒక్కో వ్యాపారి రూ.30,000 వరకు క్రెడిట్ లిమిట్ పొందవచ్చు. ఈ కార్డు 5 సంవత్సరాల వ్యాలిడిటీతో అందించబడుతుంది.
స్వనిధి క్రెడిట్ కార్డు పొందాలంటే, ముందుగా రుణం మంజూరు చేసిన సంబంధిత బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంకు అర్హతలను పరిశీలించి కార్డును జారీ చేస్తుంది. ఈ పథకం ద్వారా వ్యాపారులకు తక్షణ ఆర్థిక సహాయం అందడంతో పాటు, నగదు అవసరం లేకుండా డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం లభిస్తుంది.
ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో తొలుత పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తున్నారు. ఇప్పటికే 7,020 మంది చిరు వ్యాపారులు ఈ క్రెడిట్ కార్డుకు అర్హత సాధించారు. విజయవంతమైతే, ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







