చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- January 26, 2026
న్యూ ఢిల్లీ: చిరు వ్యాపారులు, వీధి వ్యాపారుల ఆర్థిక అవసరాలను తీర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.ఇప్పటికే పీఎం స్వనిధి పథకం ద్వారా రుణాలు పొందిన వ్యాపారులకు ఇప్పుడు ‘స్వనిధి క్రెడిట్ కార్డు’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రెడిట్ కార్డు ద్వారా వ్యాపారులు తక్కువ వడ్డీతో సులభంగా రుణాలు పొందే అవకాశం కలుగుతుంది.
పీఎం స్వనిధి స్కీమ్లో భాగంగా రెండో విడత రుణాన్ని తీసుకుని, సకాలంలో చెల్లించిన చిరు వ్యాపారులే ఈ క్రెడిట్ కార్డుకు అర్హులు. ఇది పూర్తిగా UPI లింక్ అయిన రూపే క్రెడిట్ కార్డు, దీంతో డిజిటల్ చెల్లింపులు మరింత సులభంగా మారనున్నాయి. ఒక్కో వ్యాపారి రూ.30,000 వరకు క్రెడిట్ లిమిట్ పొందవచ్చు. ఈ కార్డు 5 సంవత్సరాల వ్యాలిడిటీతో అందించబడుతుంది.
స్వనిధి క్రెడిట్ కార్డు పొందాలంటే, ముందుగా రుణం మంజూరు చేసిన సంబంధిత బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంకు అర్హతలను పరిశీలించి కార్డును జారీ చేస్తుంది. ఈ పథకం ద్వారా వ్యాపారులకు తక్షణ ఆర్థిక సహాయం అందడంతో పాటు, నగదు అవసరం లేకుండా డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం లభిస్తుంది.
ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో తొలుత పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తున్నారు. ఇప్పటికే 7,020 మంది చిరు వ్యాపారులు ఈ క్రెడిట్ కార్డుకు అర్హత సాధించారు. విజయవంతమైతే, ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







