యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- January 28, 2026
యూఏఈ: యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్ సిస్టమ్ ను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది యూఏఈ (CBUAE) ప్రారంభించింది. ప్రస్తుతం పైలట్ దశలో భాగంగా దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్లో అమలు చేస్తున్నారు. ఇక్కడ కస్టమర్లు ఫేస్ లేదా పామ్ బయోమెట్రిక్స్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. కాగా, యూఏఈ వ్యాప్తంగా అమలు చేసే విషయంలో సెంట్రల్ బ్యాంక్ క్లారిటీ ఇవ్వలేదు.
బయోమెట్రిక్ పేమెంట్స్ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తూ లావాదేవీల భద్రతను పెంచుతాయని సెంట్రల్ బ్యాంక్ లోని బ్యాంకింగ్ ఆపరేషన్స్ అసిస్టెంట్ గవర్నర్ సైఫ్ హుమైద్ అల్ ధహేరి తెలిపారు. ఆర్థిక సంస్థలు సాంప్రదాయ చెల్లింపు పద్ధతులకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నందున డిజిటల్ వాణిజ్యంలో బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రముక పాత్ర పోషిస్తాయని నెట్వర్క్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మురాత్ కాగ్రి సుజర్ అన్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







