మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
- January 28, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన తాజా క్యాబినెట్ సమావేశంలో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన పరిణామాలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్సనల్ అసిస్టెంట్ (PA) అప్పన్న బ్యాంక్ ఖాతాలోకి సుమారు రూ.4.5 కోట్లు జమ అయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు.ఈ నిధుల బదిలీకి, నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టులకు మధ్య ఉన్న సంబంధం పై లోతైన విచారణ జరపాలని నిర్ణయించారు.
ఈ చర్చ సందర్భంగా కల్తీ నెయ్యి తయారీ వెనుక ఉన్న దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెండర్లు దక్కించుకున్న కొన్ని డెయిరీలు కేవలం లాభాపేక్షతో, నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కి రసాయనాలతో కూడిన నెయ్యిని సరఫరా చేసినట్లు మంత్రులు వెల్లడించారు. జంతువుల కొవ్వు మరియు ఇతర హానికర రసాయనాలను వినియోగించి నెయ్యిని తయారు చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వారు పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే అంశంపై సిట్ (SIT) విచారణను మరింత వేగవంతం చేయాలని క్యాబినెట్ అభిప్రాయపడింది.
ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “గత ప్రభుత్వ పెద్దలు తప్పులు చేసి, ఇప్పుడు ఆ నెపాన్ని మన మీదకు నెట్టేందుకు ప్రయత్నిస్తారని, మంత్రులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు. ప్రతి విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని, పవిత్రమైన తిరుమల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.విచారణలో ఎవరి పాత్ర తేలినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.దీంతో ఈ నెయ్యి కల్తీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలకు దారితీసేలా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









