షార్జా బిల్డింగ్లో బాంబు బూచి
- July 29, 2016
అల్ ఖాసిమి రెసిడెంట్స్ బాంబు భయంతో విలవిల్లాడారు. మస్రెక్ బిల్డింగ్లో బాంబు ఉందంటూ వార్తలు రావడమే దీనికి కారణం. ఈ వార్తలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బిల్డింగ్ని, పరిసరాల్లోని ప్రజల్ని అప్పటికప్పుడు కాళీ చేయించి, తనిఖీలు నిర్వహించారు. ఎక్స్ప్లోజియన్, పెట్రోల్స్, సిఐడి, అంబులెన్స్, సివిల్ డిఫెన్స్, ఫైర్ ఫైటర్స్ తదితర విభాగాలన్నీ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. తనిఖీల అనంతరం అది ఉత్తుత్తి బెదిరింపు ప్రచారమని తేల్చారు. తాను భోజనం చేస్తుండగా పోలీస్ సైరన్, బాంబు హెచ్చరికలు విన్నాననీ, వెంటనే ఇంట్లోంచి బయటకు వచ్చేశానని జాక్ లుమీర్ అనే రెసిడెంట్ చెప్పారు. బాంబు భయంతో విలవిల్లాడామనీ, అదంతా ఉత్తదేనని తేలాక ఊపిరి పీల్చుకున్నామని పలువురు రెసిడెంట్స్ పరిస్థితిని వివరించారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









