24 మంది ప్రాణాలు తీసిన ఐఎస్
- July 29, 2016
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ సిరియాలోని ఓ గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అక్కడి 24 మంది పౌరులను దారుణంగా చంపేసింది. ఐఎస్ గత 24 గంటల్లో సిరియా ఉత్తరప్రాంతంలోని బుయిర్ గ్రామంలో 24 మంది ప్రాణాలు తీసిందని అమెరికా మద్దతుతో నడుస్తున్న కుర్దిష్-అరబ్ అలియాన్స్ అనే పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. టర్కీ సరిహద్దులో మాన్బిజ్ పట్టణానికి పది కి.మీ.ల దూరంలో ఉన్న ఈ బుయిర్ గ్రామాన్ని ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో పాటు మాన్బిజ్ పరిసరాల్లోని చాలా గ్రామాలు ఉగ్రవాదులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. సిరియా, ఇరాక్లలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తీవ్ర అరాచకాలకు పాల్పడుత్ను సంగతి తెలిసిందే. ఆత్మాహుతి దాడులతో పాటు పౌరులపై దాడులు చేసి కిరాతకంగా చంపేస్తున్నారు.వైమానిక దాడుల్లో మరో 28 మంది మృతి సిరియా ఉత్తర ప్రాంతంలో ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకున్న గ్రామంపై ఉగ్రవాదులు లక్ష్యంగా అమెరికా ఆధ్వర్యంలో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కూడా సుమారు 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటన్కు చెందిన మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. అల్-ఘండోర్ గ్రామంలో గత రాత్రి ఈ వైమానిక దాడులు జరిగినట్లు పేర్కొంది. ఈ గ్రామం కూడా మాన్బిజ్ పట్టణ సమీపంలోనే ఉంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







