24 మంది ప్రాణాలు తీసిన ఐఎస్
- July 29, 2016
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ సిరియాలోని ఓ గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అక్కడి 24 మంది పౌరులను దారుణంగా చంపేసింది. ఐఎస్ గత 24 గంటల్లో సిరియా ఉత్తరప్రాంతంలోని బుయిర్ గ్రామంలో 24 మంది ప్రాణాలు తీసిందని అమెరికా మద్దతుతో నడుస్తున్న కుర్దిష్-అరబ్ అలియాన్స్ అనే పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. టర్కీ సరిహద్దులో మాన్బిజ్ పట్టణానికి పది కి.మీ.ల దూరంలో ఉన్న ఈ బుయిర్ గ్రామాన్ని ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో పాటు మాన్బిజ్ పరిసరాల్లోని చాలా గ్రామాలు ఉగ్రవాదులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. సిరియా, ఇరాక్లలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తీవ్ర అరాచకాలకు పాల్పడుత్ను సంగతి తెలిసిందే. ఆత్మాహుతి దాడులతో పాటు పౌరులపై దాడులు చేసి కిరాతకంగా చంపేస్తున్నారు.వైమానిక దాడుల్లో మరో 28 మంది మృతి సిరియా ఉత్తర ప్రాంతంలో ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకున్న గ్రామంపై ఉగ్రవాదులు లక్ష్యంగా అమెరికా ఆధ్వర్యంలో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కూడా సుమారు 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటన్కు చెందిన మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. అల్-ఘండోర్ గ్రామంలో గత రాత్రి ఈ వైమానిక దాడులు జరిగినట్లు పేర్కొంది. ఈ గ్రామం కూడా మాన్బిజ్ పట్టణ సమీపంలోనే ఉంది.
తాజా వార్తలు
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ









