24 మంది ప్రాణాలు తీసిన ఐఎస్
- July 29, 2016
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ సిరియాలోని ఓ గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అక్కడి 24 మంది పౌరులను దారుణంగా చంపేసింది. ఐఎస్ గత 24 గంటల్లో సిరియా ఉత్తరప్రాంతంలోని బుయిర్ గ్రామంలో 24 మంది ప్రాణాలు తీసిందని అమెరికా మద్దతుతో నడుస్తున్న కుర్దిష్-అరబ్ అలియాన్స్ అనే పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. టర్కీ సరిహద్దులో మాన్బిజ్ పట్టణానికి పది కి.మీ.ల దూరంలో ఉన్న ఈ బుయిర్ గ్రామాన్ని ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో పాటు మాన్బిజ్ పరిసరాల్లోని చాలా గ్రామాలు ఉగ్రవాదులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. సిరియా, ఇరాక్లలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తీవ్ర అరాచకాలకు పాల్పడుత్ను సంగతి తెలిసిందే. ఆత్మాహుతి దాడులతో పాటు పౌరులపై దాడులు చేసి కిరాతకంగా చంపేస్తున్నారు.వైమానిక దాడుల్లో మరో 28 మంది మృతి సిరియా ఉత్తర ప్రాంతంలో ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకున్న గ్రామంపై ఉగ్రవాదులు లక్ష్యంగా అమెరికా ఆధ్వర్యంలో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కూడా సుమారు 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటన్కు చెందిన మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. అల్-ఘండోర్ గ్రామంలో గత రాత్రి ఈ వైమానిక దాడులు జరిగినట్లు పేర్కొంది. ఈ గ్రామం కూడా మాన్బిజ్ పట్టణ సమీపంలోనే ఉంది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







