24 మంది ప్రాణాలు తీసిన ఐఎస్
- July 29, 2016
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ సిరియాలోని ఓ గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అక్కడి 24 మంది పౌరులను దారుణంగా చంపేసింది. ఐఎస్ గత 24 గంటల్లో సిరియా ఉత్తరప్రాంతంలోని బుయిర్ గ్రామంలో 24 మంది ప్రాణాలు తీసిందని అమెరికా మద్దతుతో నడుస్తున్న కుర్దిష్-అరబ్ అలియాన్స్ అనే పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. టర్కీ సరిహద్దులో మాన్బిజ్ పట్టణానికి పది కి.మీ.ల దూరంలో ఉన్న ఈ బుయిర్ గ్రామాన్ని ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో పాటు మాన్బిజ్ పరిసరాల్లోని చాలా గ్రామాలు ఉగ్రవాదులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. సిరియా, ఇరాక్లలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తీవ్ర అరాచకాలకు పాల్పడుత్ను సంగతి తెలిసిందే. ఆత్మాహుతి దాడులతో పాటు పౌరులపై దాడులు చేసి కిరాతకంగా చంపేస్తున్నారు.వైమానిక దాడుల్లో మరో 28 మంది మృతి సిరియా ఉత్తర ప్రాంతంలో ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకున్న గ్రామంపై ఉగ్రవాదులు లక్ష్యంగా అమెరికా ఆధ్వర్యంలో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కూడా సుమారు 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటన్కు చెందిన మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. అల్-ఘండోర్ గ్రామంలో గత రాత్రి ఈ వైమానిక దాడులు జరిగినట్లు పేర్కొంది. ఈ గ్రామం కూడా మాన్బిజ్ పట్టణ సమీపంలోనే ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







