అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- January 29, 2026
మస్కట్: మస్కట్లో మిడిల్ ఈస్ట్ స్పేస్ కాన్ఫరెన్స్ 2026 విజయవంతంగా ముగిసింది. అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ కాన్ఫరెన్స్ అనేక సిఫార్సులను చేసింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల నుండి, అలాగే విద్యాసంస్థల నుండి నిపుణులు ఈ సెషన్ లో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు సమావేశం పిలుపునిచ్చింది.
అంతరిక్ష రంగంలో ఆధునిక టెక్నాలజీ మరియు ఆధునిక బిజినెస్ మోడళ్ల పురోగతికి కొత్త పెట్టుబడులు అవసరం అవుతాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక, ఆహారం మరియు నీటి భద్రత, విపత్తు నిర్వహణ, పర్యావరణం, రవాణా మరియు స్మార్ట్ సిటీలలో జాతీయ ప్రాధాన్యతలను అందించడానికి అంతరిక్ష రంగం సహకారం ఇంకా పెరగాల్సి ఉందని సమావేశంలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో అంతరిక్ష రంగంలో ఐదు ప్రతిష్టాత్మక ఒప్పందాలు కుదిరాయి.
తాజా వార్తలు
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!







