అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- January 29, 2026
మస్కట్: మస్కట్లో మిడిల్ ఈస్ట్ స్పేస్ కాన్ఫరెన్స్ 2026 విజయవంతంగా ముగిసింది. అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ కాన్ఫరెన్స్ అనేక సిఫార్సులను చేసింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల నుండి, అలాగే విద్యాసంస్థల నుండి నిపుణులు ఈ సెషన్ లో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు సమావేశం పిలుపునిచ్చింది.
అంతరిక్ష రంగంలో ఆధునిక టెక్నాలజీ మరియు ఆధునిక బిజినెస్ మోడళ్ల పురోగతికి కొత్త పెట్టుబడులు అవసరం అవుతాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక, ఆహారం మరియు నీటి భద్రత, విపత్తు నిర్వహణ, పర్యావరణం, రవాణా మరియు స్మార్ట్ సిటీలలో జాతీయ ప్రాధాన్యతలను అందించడానికి అంతరిక్ష రంగం సహకారం ఇంకా పెరగాల్సి ఉందని సమావేశంలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో అంతరిక్ష రంగంలో ఐదు ప్రతిష్టాత్మక ఒప్పందాలు కుదిరాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









