ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- January 29, 2026
దోహా: పెట్టుబడి అవకాశాలపై ఖతార్ చాంబర్, ఇండియా నుండి వచ్చిన వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. రెండు దేశాల మధ్య వాణిజ్య మరియు ఆర్థిక సంబంధాలు.. వాటిని పెంచే మార్గాలపై చర్చలు జరిపారు. ఖతార్ తరపున ఖతార్ చాంబర్ సెకండ్ వైస్-చైర్మన్ రషీద్ బిన్ హమద్ అల్ అత్బా నాయకత్వం వహించగా, భారత ప్రతినిధి బృందానికి PHDCCIలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కమిటీ కో-చైర్మన్ అనుజ్ ఖన్నా నాయకత్వం వహించారు.
ఖతార్ మరియు భారత్ మధ్య ఉన్న వాణిజ్య మరియు ఆర్థిక రంగాలలో బలమైన సంబంధాలను ప్రశంసించారు. ఖతార్ కీలక వాణిజ్య భాగస్వాములలో భారత్ ఒకటి అని, 2024 లో ద్వైపాక్షిక వాణిజ్యం QR 47 బిలియన్లకు చేరుకుందని రషీద్ బిన్ హమద్ అల్ అత్బా పేర్కొన్నారు.
రెండు దేశాలలో వ్యాపార రంగాలకు అందుబాటులో ఉన్న విస్తృత అవకాశాలపై సమీక్షించారు. కొత్త పెట్టుబడి రంగాలను అన్వేషించాలని నిర్ణయించారు. ఖతార్ ఒక ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానం మరియు మిడిలీస్టు, ఆఫ్రికా మార్కెట్లకు భారతీయ పెట్టుబడిదారులకు ప్రవేశ ద్వారం అని అనుజ్ ఖన్నా అన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఖన్నా ఖతారీ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







