ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- January 29, 2026
దోహా: పెట్టుబడి అవకాశాలపై ఖతార్ చాంబర్, ఇండియా నుండి వచ్చిన వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. రెండు దేశాల మధ్య వాణిజ్య మరియు ఆర్థిక సంబంధాలు.. వాటిని పెంచే మార్గాలపై చర్చలు జరిపారు. ఖతార్ తరపున ఖతార్ చాంబర్ సెకండ్ వైస్-చైర్మన్ రషీద్ బిన్ హమద్ అల్ అత్బా నాయకత్వం వహించగా, భారత ప్రతినిధి బృందానికి PHDCCIలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కమిటీ కో-చైర్మన్ అనుజ్ ఖన్నా నాయకత్వం వహించారు.
ఖతార్ మరియు భారత్ మధ్య ఉన్న వాణిజ్య మరియు ఆర్థిక రంగాలలో బలమైన సంబంధాలను ప్రశంసించారు. ఖతార్ కీలక వాణిజ్య భాగస్వాములలో భారత్ ఒకటి అని, 2024 లో ద్వైపాక్షిక వాణిజ్యం QR 47 బిలియన్లకు చేరుకుందని రషీద్ బిన్ హమద్ అల్ అత్బా పేర్కొన్నారు.
రెండు దేశాలలో వ్యాపార రంగాలకు అందుబాటులో ఉన్న విస్తృత అవకాశాలపై సమీక్షించారు. కొత్త పెట్టుబడి రంగాలను అన్వేషించాలని నిర్ణయించారు. ఖతార్ ఒక ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానం మరియు మిడిలీస్టు, ఆఫ్రికా మార్కెట్లకు భారతీయ పెట్టుబడిదారులకు ప్రవేశ ద్వారం అని అనుజ్ ఖన్నా అన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఖన్నా ఖతారీ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా
- ఈద్ అల్ ఫితర్.. దుబాయ్ లో 3 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- నివాస ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పిస్తే SR100,000 జరిమానా, జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో 240,000 మందికి పైగా విద్యార్థులకు ఆన్లైన్ చదువులు..!!
- స్ప్రింగ్ బ్రేక్ తర్వాత మరో రెండు వారాలు ఆన్లైన్ క్లాసులు..
- వాటర్ ట్యాంకర్ల ధరలు పెంపు..నోటీసులు జారీ..!!









