వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు
- January 29, 2026
న్యూఢిల్లీ: భారత్కు ప్రతిష్టాత్మకమైన పౌర విమానయాన కార్యక్రమమైన వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా, యూఏఈ, సౌదీ అరేబియా, రష్యా మరియు డొమినికన్ రిపబ్లిక్ దేశాల మంత్రిత్వస్థాయి ప్రతినిధి బృందాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించబడాయి.
భారత్ నిర్వహిస్తున్న ఈ ఫ్లాగ్షిప్ పౌర విమానయాన ఈవెంట్లో 20 దేశాలు పాల్గొనడం, గౌరవనీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జీ ప్రేరణాత్మక నాయకత్వంలో భారత విమానయాన రంగంపై ప్రపంచానికి ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.
భారత్ ప్రస్తుతం కేవలం ఒక పెద్ద విమానయాన మార్కెట్గా మాత్రమే కాకుండా, సమగ్రంగా మరియు ప్రభావవంతంగా ఎదుగుతున్న విమానయాన ఎకోసిస్టంగా రూపాంతరం చెందుతోంది. దీనివల్ల అంతర్జాతీయ భాగస్వామ్యాలు, దీర్ఘకాలిక సహకారానికి భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారుతోంది.
ఈ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా, తయారీ రంగం, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ, స్థిరత్వం (సస్టెయినబిలిటీ) వంటి అంశాలను అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసే కీలక రంగాలుగా ప్రస్తావించారు. భారత్తో భాగస్వామ్యానికి ఆసక్తి చూపుతున్న దేశాలతో భవిష్యత్తులో మరింత విస్తృతమైన సహకారం సాధ్యమవుతుందని ఈ సమావేశాలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం







