వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు
- January 29, 2026
న్యూఢిల్లీ: భారత్కు ప్రతిష్టాత్మకమైన పౌర విమానయాన కార్యక్రమమైన వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా, యూఏఈ, సౌదీ అరేబియా, రష్యా మరియు డొమినికన్ రిపబ్లిక్ దేశాల మంత్రిత్వస్థాయి ప్రతినిధి బృందాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించబడాయి.
భారత్ నిర్వహిస్తున్న ఈ ఫ్లాగ్షిప్ పౌర విమానయాన ఈవెంట్లో 20 దేశాలు పాల్గొనడం, గౌరవనీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జీ ప్రేరణాత్మక నాయకత్వంలో భారత విమానయాన రంగంపై ప్రపంచానికి ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.
భారత్ ప్రస్తుతం కేవలం ఒక పెద్ద విమానయాన మార్కెట్గా మాత్రమే కాకుండా, సమగ్రంగా మరియు ప్రభావవంతంగా ఎదుగుతున్న విమానయాన ఎకోసిస్టంగా రూపాంతరం చెందుతోంది. దీనివల్ల అంతర్జాతీయ భాగస్వామ్యాలు, దీర్ఘకాలిక సహకారానికి భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారుతోంది.
ఈ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా, తయారీ రంగం, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ, స్థిరత్వం (సస్టెయినబిలిటీ) వంటి అంశాలను అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసే కీలక రంగాలుగా ప్రస్తావించారు. భారత్తో భాగస్వామ్యానికి ఆసక్తి చూపుతున్న దేశాలతో భవిష్యత్తులో మరింత విస్తృతమైన సహకారం సాధ్యమవుతుందని ఈ సమావేశాలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









