ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- January 29, 2026
యూఏఈ: ఫుజైరాలో ఒక యువ భారతీయ ప్రవాసుడు తన ట్రైలర్లో నిద్రపోతున్నప్పుడు అనుమానస్పదంగా మరణించిన ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల అన్సార్ మృతదేహం అతను పనిచేస్తున్న ట్రైలర్ ట్రక్కులో లభించిందని, అతని మరణానికి కారణం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. అతని మరణానికి కచ్చితమైన కారణం తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.
అన్సార్ కేరళకు చెందినవాడు. ఎనిమిది సంవత్సరాల క్రితం యూఏఈకి వచ్చాడు. అప్పటి నుండి అతను తన స్వస్థలాన్ని సందర్శించలేదని, అతను వచ్చే నెలలో భారత్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని మృతుడి సోదరుడు అనస్ చెప్పాడు. అతను మసాఫీలోని ఒక గ్యారేజీలో పనిచేసేవాడని, యూఏఈ అంతటా ప్రయాణిస్తాడని, గత నెలలో హెవీ ట్రక్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని తెలిపాడు.
అన్సార్ మసాఫీలో పనిచేస్తుండగా, అనస్ తన తండ్రి మరియు మామతో కలిసి ముర్బాలో పనిచేస్తున్నాడు. వారు ఆ ప్రాంతంలో ఒక కిరాణా దుకాణాన్ని నడుపుతున్నారు. వారి తండ్రి ఈ నెల ప్రారంభంలో భారత్ కు వెళ్లారు. మరోవైపు, కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ (కేఎంసీసీ) అనే సంస్థ అన్సార్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తోందని ఒక సామాజిక కార్యకర్త చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్







