ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- January 29, 2026
యూఏఈ: ఫుజైరాలో ఒక యువ భారతీయ ప్రవాసుడు తన ట్రైలర్లో నిద్రపోతున్నప్పుడు అనుమానస్పదంగా మరణించిన ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల అన్సార్ మృతదేహం అతను పనిచేస్తున్న ట్రైలర్ ట్రక్కులో లభించిందని, అతని మరణానికి కారణం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. అతని మరణానికి కచ్చితమైన కారణం తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.
అన్సార్ కేరళకు చెందినవాడు. ఎనిమిది సంవత్సరాల క్రితం యూఏఈకి వచ్చాడు. అప్పటి నుండి అతను తన స్వస్థలాన్ని సందర్శించలేదని, అతను వచ్చే నెలలో భారత్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని మృతుడి సోదరుడు అనస్ చెప్పాడు. అతను మసాఫీలోని ఒక గ్యారేజీలో పనిచేసేవాడని, యూఏఈ అంతటా ప్రయాణిస్తాడని, గత నెలలో హెవీ ట్రక్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని తెలిపాడు.
అన్సార్ మసాఫీలో పనిచేస్తుండగా, అనస్ తన తండ్రి మరియు మామతో కలిసి ముర్బాలో పనిచేస్తున్నాడు. వారు ఆ ప్రాంతంలో ఒక కిరాణా దుకాణాన్ని నడుపుతున్నారు. వారి తండ్రి ఈ నెల ప్రారంభంలో భారత్ కు వెళ్లారు. మరోవైపు, కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ (కేఎంసీసీ) అనే సంస్థ అన్సార్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తోందని ఒక సామాజిక కార్యకర్త చెప్పారు.
తాజా వార్తలు
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా
- ఈద్ అల్ ఫితర్.. దుబాయ్ లో 3 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- నివాస ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పిస్తే SR100,000 జరిమానా, జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో 240,000 మందికి పైగా విద్యార్థులకు ఆన్లైన్ చదువులు..!!
- స్ప్రింగ్ బ్రేక్ తర్వాత మరో రెండు వారాలు ఆన్లైన్ క్లాసులు..
- వాటర్ ట్యాంకర్ల ధరలు పెంపు..నోటీసులు జారీ..!!









