పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- January 30, 2026
కేరళ: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు డా. పీటీ ఉషా భర్త వి. శ్రీనివాసన్ (64) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కేరళలోని కోజికోడ్ జిల్లా తిక్కోడి పెరుమల్పురంలోని నివాసంలో రాత్రి సుమారు 1 గంట సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన సమయంలో డా. పీటీ ఉషా ఇంట్లో లేరు. ఆమె పార్లమెంట్ సమావేశాలకు నిమిత్తం ఢిల్లీలో ఉన్నారు. ప్రస్తుతం స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు.
శ్రీనివాసన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో ఇన్స్పెక్టర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. క్రీడాకారుడు కూడా అయిన ఆయన 1991లో పీటీ ఉషను వివాహం చేసుకున్నారు. వీరికి విఘ్నేష్ ఉజ్వల్ కుమారుడు ఉన్నాడు. పీటీ ఉష నడిపే ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ అభివృద్ధిలో శ్రీనివాసన్ కీలక పాత్ర పోషించారు. శ్రీనివాసన్ ఆకస్మిక మరణంపై పలువురు క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పీటీ ఉష సాధించిన ప్రతీ విజయానికి ఆయన నిరంతర ప్రోత్సాహం, మద్దతే కీలకమైనదని క్రీడా ప్రపంచం గుర్తు చేసుకుంటోంది.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







