సీజనల్ ఫిషింగ్ బ్యాన్ ఎత్తివేతకు బహ్రెయిన్ నిరాకరణ..!!
- January 31, 2026
మనామా: సీజనల్ ఫిషింగ్ బ్యాన్ను ఎత్తివేసి, బహ్రెయిన్ మత్స్యకారులకు పరిహారం చెల్లించాలని పార్లమెంటు అభ్యర్థనలను ప్రభుత్వం తిరస్కరించింది. చేపల నిల్వలను రక్షించడానికి ఆంక్షలు చట్టబద్ధమైనవని, కఠిన నిబంధనల అమలు అవసరమని ప్రభుత్వం పేర్కొంది.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ మరియు మే నెలల్లో బహ్రెయిన్ ప్రాదేశిక జలాల్లో సఫీ, షారి మరియు 'అండాక్' చేపల వేటను నిషేధించే 2024 నాటి నిర్ణయం నెం. (2)ని నిలిపివేయాలన్న పిలుపులను సమీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిషేధం 2024 మేలో మాత్రమే వర్తిస్తుందని మరియు దానిని ఆపలేమని పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొంది.
ప్రజా ప్రయోజనం దృష్ట్యా సముద్ర వనరులను సంరక్షించడానికి తాత్కాలిక ఫిషింగ్ బ్యాన్లను అనుమతించే 2002 నాటి డిక్రీ-లా నంబర్ (20)ని ప్రభుత్వం గుర్తుచేసింది. ఏప్రిల్ మరియు మే నెలలు చేపల ఫర్టిలిటీ నెలలు అని, పొరుగు దేశాలలో ఇలాంటి కాలానుగుణ నిషేధాలు అమలులో ఉన్నాయని పేర్కొంది. నిషేధ కాలంలో మత్స్యకారులకు పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదనలను కూడా తిరస్కరించారు. నిషేధం పరిమితంగా ఉందని, రెండు నెలల పాటు మూడు జాతుల చాపలను మాత్రమే కవర్ చేస్తుందని , చేపలు పట్టడంపై పూర్తిగా నిషేధం లేదని ప్రభుత్వం తెలిపింది.
ఇంధన సబ్సిడీలు, పడవ మరియు పరికరాల మద్దతు, టామ్కీన్ వేతన పథకాలు మరియు ఆక్వాకల్చర్ కార్యక్రమాలతో సహా మద్దతు ఇప్పటికే అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐదుగురు ఎంపీలు ఏప్రిల్ 2025లో ఈ ప్రతిపాదనలను దాఖలు చేశారు.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









