సీజనల్ ఫిషింగ్ బ్యాన్ ఎత్తివేతకు బహ్రెయిన్ నిరాకరణ..!!
- January 31, 2026
మనామా: సీజనల్ ఫిషింగ్ బ్యాన్ను ఎత్తివేసి, బహ్రెయిన్ మత్స్యకారులకు పరిహారం చెల్లించాలని పార్లమెంటు అభ్యర్థనలను ప్రభుత్వం తిరస్కరించింది. చేపల నిల్వలను రక్షించడానికి ఆంక్షలు చట్టబద్ధమైనవని, కఠిన నిబంధనల అమలు అవసరమని ప్రభుత్వం పేర్కొంది.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ మరియు మే నెలల్లో బహ్రెయిన్ ప్రాదేశిక జలాల్లో సఫీ, షారి మరియు 'అండాక్' చేపల వేటను నిషేధించే 2024 నాటి నిర్ణయం నెం. (2)ని నిలిపివేయాలన్న పిలుపులను సమీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిషేధం 2024 మేలో మాత్రమే వర్తిస్తుందని మరియు దానిని ఆపలేమని పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొంది.
ప్రజా ప్రయోజనం దృష్ట్యా సముద్ర వనరులను సంరక్షించడానికి తాత్కాలిక ఫిషింగ్ బ్యాన్లను అనుమతించే 2002 నాటి డిక్రీ-లా నంబర్ (20)ని ప్రభుత్వం గుర్తుచేసింది. ఏప్రిల్ మరియు మే నెలలు చేపల ఫర్టిలిటీ నెలలు అని, పొరుగు దేశాలలో ఇలాంటి కాలానుగుణ నిషేధాలు అమలులో ఉన్నాయని పేర్కొంది. నిషేధ కాలంలో మత్స్యకారులకు పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదనలను కూడా తిరస్కరించారు. నిషేధం పరిమితంగా ఉందని, రెండు నెలల పాటు మూడు జాతుల చాపలను మాత్రమే కవర్ చేస్తుందని , చేపలు పట్టడంపై పూర్తిగా నిషేధం లేదని ప్రభుత్వం తెలిపింది.
ఇంధన సబ్సిడీలు, పడవ మరియు పరికరాల మద్దతు, టామ్కీన్ వేతన పథకాలు మరియు ఆక్వాకల్చర్ కార్యక్రమాలతో సహా మద్దతు ఇప్పటికే అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐదుగురు ఎంపీలు ఏప్రిల్ 2025లో ఈ ప్రతిపాదనలను దాఖలు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







