సీజనల్ ఫిషింగ్ బ్యాన్ ఎత్తివేతకు బహ్రెయిన్ నిరాకరణ..!!
- January 31, 2026
మనామా: సీజనల్ ఫిషింగ్ బ్యాన్ను ఎత్తివేసి, బహ్రెయిన్ మత్స్యకారులకు పరిహారం చెల్లించాలని పార్లమెంటు అభ్యర్థనలను ప్రభుత్వం తిరస్కరించింది. చేపల నిల్వలను రక్షించడానికి ఆంక్షలు చట్టబద్ధమైనవని, కఠిన నిబంధనల అమలు అవసరమని ప్రభుత్వం పేర్కొంది.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ మరియు మే నెలల్లో బహ్రెయిన్ ప్రాదేశిక జలాల్లో సఫీ, షారి మరియు 'అండాక్' చేపల వేటను నిషేధించే 2024 నాటి నిర్ణయం నెం. (2)ని నిలిపివేయాలన్న పిలుపులను సమీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిషేధం 2024 మేలో మాత్రమే వర్తిస్తుందని మరియు దానిని ఆపలేమని పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొంది.
ప్రజా ప్రయోజనం దృష్ట్యా సముద్ర వనరులను సంరక్షించడానికి తాత్కాలిక ఫిషింగ్ బ్యాన్లను అనుమతించే 2002 నాటి డిక్రీ-లా నంబర్ (20)ని ప్రభుత్వం గుర్తుచేసింది. ఏప్రిల్ మరియు మే నెలలు చేపల ఫర్టిలిటీ నెలలు అని, పొరుగు దేశాలలో ఇలాంటి కాలానుగుణ నిషేధాలు అమలులో ఉన్నాయని పేర్కొంది. నిషేధ కాలంలో మత్స్యకారులకు పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదనలను కూడా తిరస్కరించారు. నిషేధం పరిమితంగా ఉందని, రెండు నెలల పాటు మూడు జాతుల చాపలను మాత్రమే కవర్ చేస్తుందని , చేపలు పట్టడంపై పూర్తిగా నిషేధం లేదని ప్రభుత్వం తెలిపింది.
ఇంధన సబ్సిడీలు, పడవ మరియు పరికరాల మద్దతు, టామ్కీన్ వేతన పథకాలు మరియు ఆక్వాకల్చర్ కార్యక్రమాలతో సహా మద్దతు ఇప్పటికే అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐదుగురు ఎంపీలు ఏప్రిల్ 2025లో ఈ ప్రతిపాదనలను దాఖలు చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







