టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- February 01, 2026
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కార్యనిర్వహణాధికారి (EO)గా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 1న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ కుమార్ సింఘాల్ను తక్షణమే సాధారణ పరిపాలన విభాగం (GAD)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
టీటీడీ ఈవోగా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్రకు పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈ బాధ్యతలను నిర్వహించనున్నారు.
1993 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్ 2017 మే నుంచి 2020 అక్టోబర్ వరకు తొలిసారి టీటీడీ ఈవోగా సేవలందించారు. అనంతరం గతేడాది సెప్టెంబరులో రెండోసారి ఈ పదవిని చేపట్టారు. అయితే కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ఆయన బదిలీ కావడం టీటీడీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంపై సిట్ నివేదిక వెలువడిన కొన్ని రోజుల్లోనే ఈ బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







