టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- February 01, 2026
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కార్యనిర్వహణాధికారి (EO)గా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 1న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ కుమార్ సింఘాల్ను తక్షణమే సాధారణ పరిపాలన విభాగం (GAD)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
టీటీడీ ఈవోగా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్రకు పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈ బాధ్యతలను నిర్వహించనున్నారు.
1993 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్ 2017 మే నుంచి 2020 అక్టోబర్ వరకు తొలిసారి టీటీడీ ఈవోగా సేవలందించారు. అనంతరం గతేడాది సెప్టెంబరులో రెండోసారి ఈ పదవిని చేపట్టారు. అయితే కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ఆయన బదిలీ కావడం టీటీడీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంపై సిట్ నివేదిక వెలువడిన కొన్ని రోజుల్లోనే ఈ బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









