భారత్తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే
- February 02, 2026
టీ20 ప్రపంచకప్ 2026లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్లో పాల్గొనకూడదని పాక్ ప్రభుత్వం తమ క్రికెట్ జట్టును ఆదేశించింది. దీనిపై తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పందించింది.
పాక్ ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ క్రీడా నియమాలకు విరుద్ధమని తెలిపింది. అయితే.. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదంది.
‘పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మా దృష్టికి వచ్చింది. అయితే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. దీని కోసం ఎదురుచూస్తున్నాం. ఇలాంటి మెగాటోర్నీల్లో ఎంపిక చేసిన మ్యాచ్ల్లో మాత్రమే పాల్గొనడం అనే వారి వైఖరి ఆమోదయోగ్యం కాదు. టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు ఈవెంట్ షెడ్యూల్ ప్రకారం సమాన నిబంధనలతో పోటీ పడతాయని భావిస్తున్నాం. ‘అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
జాతీయ విధాన విషయాలలో ప్రభుత్వాల పాత్రలను ఐసీసీ గౌరవిస్తున్నప్పటికీ, ఈ నిర్ణయం ప్రపంచ క్రీడకు లేదా పాకిస్తాన్లోని లక్షలాది మందితో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు మంచిది కాదని చెప్పింది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం.. ఆ దేశంలోని క్రికెట్ పై దీర్షకాలిక ప్రభావాలను చూపే అవకాశం ఉందని, కాబట్టి జాగ్రత్తగా పరిశీలించాలని కోరింది.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ను విజయవంతంగా నిర్వహించడం ఐసీసీ బాధ్యత మాత్రమే కాదని, సభ్యులందరి బాధ్యత అని చెప్పింది. పీసీబీ పరస్పరం ఆమోదయోగ్యమైన తీర్మానాన్ని అన్వేషించాలని, ఇది అన్ని వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని ఆశిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







