ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- February 03, 2026
కువైట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (సీబీకే) ఎక్స్ఛేంజ్ కంపెనీలు కస్టమర్ల నుండి స్వీకరించగల రోజువారీ క్యాష్ లిమిట్ ను రోజుకు కేడీ 1,000కి తగ్గించింది. ఈ మేరకు కొత్త నిబంధనలు ఫిబ్రవరి 2 నుండి అమలులోకి వచ్చాయని ఒక ప్రకటలో తెలిపింది. అయితే, గతంలో కస్టమర్లు కేడీ 3,000 వరకు నగదు రూపంలో చెల్లించడానికి అనుమతి ఉండేది. కానీ కొత్త నిబంధన ప్రకారం, ఎక్స్ఛేంజ్ కంపెనీలలో కేడీ 1,000 కంటే ఎక్కువ నగదు చెల్లింపులను ఇకపై అనుమతించరు.
అయితే, లావాదేవీల మొత్తం విలువపై ఎటువంటి పరిమితి లేదని, ఈ పరిమితి చెల్లింపులోని నగదుకు మాత్రమే వర్తిస్తుందని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. విదేశీ డబ్బు బదిలీలకు అలాగే విదేశీ కరెన్సీల కొనుగోలు మరియు అమ్మకాలకు కూడా వర్తిస్తుందని తెలియజేసింది. మనీలాండరింగ్ మరియు ఉగ్రవాదానికి నిధుల సరఫరాకు వ్యతిరేకంగా నియంత్రణలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కువైట్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









