ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- February 03, 2026
కువైట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (సీబీకే) ఎక్స్ఛేంజ్ కంపెనీలు కస్టమర్ల నుండి స్వీకరించగల రోజువారీ క్యాష్ లిమిట్ ను రోజుకు కేడీ 1,000కి తగ్గించింది. ఈ మేరకు కొత్త నిబంధనలు ఫిబ్రవరి 2 నుండి అమలులోకి వచ్చాయని ఒక ప్రకటలో తెలిపింది. అయితే, గతంలో కస్టమర్లు కేడీ 3,000 వరకు నగదు రూపంలో చెల్లించడానికి అనుమతి ఉండేది. కానీ కొత్త నిబంధన ప్రకారం, ఎక్స్ఛేంజ్ కంపెనీలలో కేడీ 1,000 కంటే ఎక్కువ నగదు చెల్లింపులను ఇకపై అనుమతించరు.
అయితే, లావాదేవీల మొత్తం విలువపై ఎటువంటి పరిమితి లేదని, ఈ పరిమితి చెల్లింపులోని నగదుకు మాత్రమే వర్తిస్తుందని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. విదేశీ డబ్బు బదిలీలకు అలాగే విదేశీ కరెన్సీల కొనుగోలు మరియు అమ్మకాలకు కూడా వర్తిస్తుందని తెలియజేసింది. మనీలాండరింగ్ మరియు ఉగ్రవాదానికి నిధుల సరఫరాకు వ్యతిరేకంగా నియంత్రణలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కువైట్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









