తిరుమల: తెరచుకున్న బంగారు డాలర్ల అమ్మకాల కౌంటర్
- February 06, 2026
తిరుమల: తిరుమలలో భక్తుల సౌలభ్యం కోసం నిర్వహిస్తున్న బంగారు, వెండి డాలర్ల విక్రయాల కౌంటర్ ఎట్టకేలకు తెరచుకుంది. ఇక్కడ మార్కెట్లో వాటి ధరలకు అనుగుణంగా భక్తులకు అవసరమైన డాలర్లు అమ్మకాలు చేస్తారు.ఈ మేరకు ధరల్లో తేడాతో కొద్దిరోజులు ఈ కౌంటర్ను టిటిడి మూసివేంది. చివరకు గురువారం ఉదయం నుండి కౌంటర్ను తెరచి భక్తులకు దేవుని ప్రతిమతో విక్రయించే డాలర్లు అందుబాటులో ఉంచింది. ఈనెల 10వతేదీ వరకు ఒకే ధరపై పలు రకాల డాలర్లు అమ్మకాలు భక్తులకు అందుకునే వెసలుబాటు కలిగింది.
2 గ్రాముల బంగారు డాలర్ ధర 30,828 రూపాయలుగా, 5గ్రాముల బంగారు డాలర్ 74,799 రూపాయలు, 10గ్రాముల బంగారుడాలర్ ధర 1,47,852 రూపాయలుగా నిర్ణయించి అమ్మకాలు చేస్తున్నారు. అలాగే 5గ్రాముల వెండి డాలర్ను 1,648 రూపాయలకు, 10గ్రాముల డాలర్ 3,132 రూపాయలు, 50గ్రాముల వెండి డాలర్ను 15,002 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈనెల 10వతేదీ వరకు ఇదే దరలు నిర్ణయించబడింది. శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా, భక్తితో కొనుగోలుచేసి ధరించడం సాంప్రదాయం. భక్తులు 50వేల రూపాయలు పైగా విలువైన డాలర్లు కొనుగోలు చేస్తే పాన్కార్డును తప్పనిసరిగా (జిరాక్స్ కాఫీ) సమర్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- లోక్ భవన్లో ఘనంగా గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- 12 మిలియన్ దిర్హమ్ విలువైన విలాసవంతమైన ఊద్ దొంగతనం..12 గంటల్లో ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీస్
- కోర్టుల చుట్టూ తిరగలేకే మొయిజుద్దీన్ హత్య..ఏడుగురు అరెస్ట్
- జూన్ 1 నుంచి మారనున్న కీలక ఆర్థిక నిబంధనలు ఇవే!
- పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానం చేసిన సీపీ సుమతి
- అమెరికాలో తెలుగమ్మాయికి ప్రతిష్టాత్మక పురస్కారం
- తెలంగాణలో నిప్పుల కొలిమి: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
- ఒమన్ తీవ్రమైన వేడి.. 48°Cకు ఉష్ణోగ్రతలు..!!
- క్యజో రి శిఖరాన్ని అధిరోహించిన యువ బహ్రెయిన్ సాహసికుడు..!!
- అల్ జౌర్ బీచ్లో షార్క్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..!!









