తిరుమల: తెరచుకున్న బంగారు డాలర్ల అమ్మకాల కౌంటర్
- February 06, 2026
తిరుమల: తిరుమలలో భక్తుల సౌలభ్యం కోసం నిర్వహిస్తున్న బంగారు, వెండి డాలర్ల విక్రయాల కౌంటర్ ఎట్టకేలకు తెరచుకుంది. ఇక్కడ మార్కెట్లో వాటి ధరలకు అనుగుణంగా భక్తులకు అవసరమైన డాలర్లు అమ్మకాలు చేస్తారు.ఈ మేరకు ధరల్లో తేడాతో కొద్దిరోజులు ఈ కౌంటర్ను టిటిడి మూసివేంది. చివరకు గురువారం ఉదయం నుండి కౌంటర్ను తెరచి భక్తులకు దేవుని ప్రతిమతో విక్రయించే డాలర్లు అందుబాటులో ఉంచింది. ఈనెల 10వతేదీ వరకు ఒకే ధరపై పలు రకాల డాలర్లు అమ్మకాలు భక్తులకు అందుకునే వెసలుబాటు కలిగింది.
2 గ్రాముల బంగారు డాలర్ ధర 30,828 రూపాయలుగా, 5గ్రాముల బంగారు డాలర్ 74,799 రూపాయలు, 10గ్రాముల బంగారుడాలర్ ధర 1,47,852 రూపాయలుగా నిర్ణయించి అమ్మకాలు చేస్తున్నారు. అలాగే 5గ్రాముల వెండి డాలర్ను 1,648 రూపాయలకు, 10గ్రాముల డాలర్ 3,132 రూపాయలు, 50గ్రాముల వెండి డాలర్ను 15,002 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈనెల 10వతేదీ వరకు ఇదే దరలు నిర్ణయించబడింది. శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా, భక్తితో కొనుగోలుచేసి ధరించడం సాంప్రదాయం. భక్తులు 50వేల రూపాయలు పైగా విలువైన డాలర్లు కొనుగోలు చేస్తే పాన్కార్డును తప్పనిసరిగా (జిరాక్స్ కాఫీ) సమర్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









