సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం

- July 16, 2026 , by Maagulf
సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రతిసారీ ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా కొత్త జీవో తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ తరహాలోనే నిర్ణీత పరిమితి లోపు నిర్మాతలు, పంపిణీదారులే ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛ కల్పించాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. రూ.100 నుండి రూ.1000 మధ్య ధరల ఫ్రేమ్ వర్క్ తెచ్చే అవకాశం ఉంది. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కొత్త విధానం అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఇది పరిశ్రమకు పెద్ద ఊరట లభిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com