బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్లోనే సమాధానం: వెంకయ్య నాయుడు
- February 08, 2026
విశాఖపట్నం: రాజకీయ నాయకులు మాట్లాడే భాష పై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసభ్య పదజాలం వాడే నేతలకు ప్రజలు పోలింగ్ బూత్ల్లోనే తగిన సమాధానం చెప్పాలని ఆయన సూచించారు. బూతులు మాట్లాడటాన్ని కొందరు రాజకీయ నాయకులు ఫ్యాషన్గా మార్చుకున్నారని విమర్శించారు.
విశాఖ జిల్లా పెందుర్తిలో బాలాజీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అసభ్యంగా మాట్లాడితే మీడియా దృష్టి ఆకర్షించవచ్చన్న భావనతో కొందరు నేతలు ఇష్టానుసారంగా బూతులు ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, రాజకీయ విలువలకు హానికరమని పేర్కొన్నారు.
సరైన అంశాలపై మాట్లాడే సామర్థ్యం లేకపోవడంతో కొందరు (Venkaiah Naidu remarks) నాయకులు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై కూడా వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగజారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధోరణి అన్ని రాజకీయ పార్టీల్లో కనిపిస్తోందని, అయితే కొందరు నేతలు మాత్రం ఇప్పటికీ మర్యాదగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
అసభ్య భాష వాడే నేతలకు ప్రజలు ఎన్నికల్లో నిశ్శబ్దంగా గుణపాఠం చెప్పాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. అప్పుడే అసెంబ్లీలు, పార్లమెంట్లలో విలువలు పెరుగుతాయని, భవిష్యత్ తరాలకు మంచి సందేశం వెళ్లుతుందని చెప్పారు. రాజకీయ నాయకులు తమ మాటల పట్ల బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!









