'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- February 08, 2026
చెన్నై: ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం చెన్నై లోని టి.నగర్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉచిత తెలుగు శిక్షణ తరగతులు ఏర్పాటయ్యాయి.ఆకాశవాణి విశ్రాంత ఉద్యోగిని బిట్రా గజగౌరి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.ప్రతి శనివారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఐదు నెలలపాటు తరగతులు జరుగుతాయి.సుమారు 50 మంది డబ్బింగ్ ఆర్టిస్టులు,కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు,లయన్స్ క్లబ్ సభ్యులు,విశ్రాంత ఉద్యోగులు శిక్షణలో చేరారు.ముందుగా సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి మోహన్ రావు మాట్లాడుతూ...తెలుగు భాషాభివృద్ధి సమాఖ్య అధ్యక్షులు వి.ఎల్ ఇందిరాదత్ సేవలని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సభుయలు రుక్మిణీదేవి,గోటేటి వెంకటేశ్వరరావు,ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









