'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- February 08, 2026
చెన్నై: ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం చెన్నై లోని టి.నగర్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉచిత తెలుగు శిక్షణ తరగతులు ఏర్పాటయ్యాయి.ఆకాశవాణి విశ్రాంత ఉద్యోగిని బిట్రా గజగౌరి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.ప్రతి శనివారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఐదు నెలలపాటు తరగతులు జరుగుతాయి.సుమారు 50 మంది డబ్బింగ్ ఆర్టిస్టులు,కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు,లయన్స్ క్లబ్ సభ్యులు,విశ్రాంత ఉద్యోగులు శిక్షణలో చేరారు.ముందుగా సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి మోహన్ రావు మాట్లాడుతూ...తెలుగు భాషాభివృద్ధి సమాఖ్య అధ్యక్షులు వి.ఎల్ ఇందిరాదత్ సేవలని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సభుయలు రుక్మిణీదేవి,గోటేటి వెంకటేశ్వరరావు,ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మే 11 నుంచి మళ్లీ ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోదీ
- రిజర్వేషన్లు ఉన్నా..బోర్డింగ్ నిరాకరణ.. 114 ఫిర్యాదులు..!!
- ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- లైసెన్సు లేకుండా బైక్ నడిపిన టీనేజర్ అరెస్టు..!!
- కొత్తగా వచ్చే కార్మికుల కోసం వైద్య పరీక్షలు..!!
- మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన వ్యవస్థలు..!!
- మక్కాలో 18 మంది పాకిస్థానీలు, ఆఫ్ఘన్లు అరెస్టు..!!
- నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్.. ఇద్దరు మహిళలకు 7 లక్షల దిర్హమ్ల జరిమానా..!!
- దోహా తీరంలో నౌకపై క్షిపణి దాడి









