ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- February 10, 2026
మస్కట్: 2025లో ఒమన్ పర్యాటక రంగం వృద్ధిని నమోదు చేసింది. అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు సుమారు 3.9 మిలియన్లకు చేరుకున్నాయని, ఇది 2019లో నమోదైన 3.5 మిలియన్లను అధిగమించిందని నివేదికలు వెల్లడించాయి.
ఒమన్ పర్యావరణ మరియు సాంస్కృతిక వారసత్వం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడి ప్రోత్సాహకాలు మరియు పర్యాటక ప్రాంతాల వైవిధ్యీకరణ ద్వారా ఒమన్ పర్యాటకం ఆర్థిక వైవిధ్యీకరణకు కేంద్రంగా మారుతుందని తెలిపారు. అదే సమయంలో అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకల పెరుగుదల ఒమన్ పర్యాటకంపై ప్రపంచ దేశాల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వారసత్వ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
2025లో దేశీయ పర్యాటకం కూడా బలమైన వృద్ధిని నమోదు చేసింది. దేశీయ పర్యాటక పర్యటనలు దాదాపు 14 మిలియన్లకు చేరుకోవచ్చని అంచనాలు చెబుతున్నాయి. పర్యాటకుల రాకపోకలను పెంచడం మాత్రమే కాదు, తలసరి వ్యయాన్ని పెంచడం, సగటు స్టే వ్యవధిని పొడిగించడం మరియు కాంపిటీషన్, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి సవాల్ అని ఆర్థిక విశ్లేషకుడు డాక్టర్ ఖలీద్ బిన్ హమద్ బిన్ అబ్దుల్లా అల్ రవాహి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







