ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- February 10, 2026
మస్కట్: 2025లో ఒమన్ పర్యాటక రంగం వృద్ధిని నమోదు చేసింది. అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు సుమారు 3.9 మిలియన్లకు చేరుకున్నాయని, ఇది 2019లో నమోదైన 3.5 మిలియన్లను అధిగమించిందని నివేదికలు వెల్లడించాయి.
ఒమన్ పర్యావరణ మరియు సాంస్కృతిక వారసత్వం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడి ప్రోత్సాహకాలు మరియు పర్యాటక ప్రాంతాల వైవిధ్యీకరణ ద్వారా ఒమన్ పర్యాటకం ఆర్థిక వైవిధ్యీకరణకు కేంద్రంగా మారుతుందని తెలిపారు. అదే సమయంలో అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకల పెరుగుదల ఒమన్ పర్యాటకంపై ప్రపంచ దేశాల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వారసత్వ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
2025లో దేశీయ పర్యాటకం కూడా బలమైన వృద్ధిని నమోదు చేసింది. దేశీయ పర్యాటక పర్యటనలు దాదాపు 14 మిలియన్లకు చేరుకోవచ్చని అంచనాలు చెబుతున్నాయి. పర్యాటకుల రాకపోకలను పెంచడం మాత్రమే కాదు, తలసరి వ్యయాన్ని పెంచడం, సగటు స్టే వ్యవధిని పొడిగించడం మరియు కాంపిటీషన్, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి సవాల్ అని ఆర్థిక విశ్లేషకుడు డాక్టర్ ఖలీద్ బిన్ హమద్ బిన్ అబ్దుల్లా అల్ రవాహి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!
- ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు..!!
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్









