రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- February 18, 2026
న్యూ ఢిల్లీ: త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. బుధవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 37 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు స్థానాలు ఉన్నాయి.ఈ నెల 26వ తేదీన ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
షెడ్యూల్ ప్రకారం.. మార్చి 5వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. మార్చి 9వ తేదీ వరకు దరఖాస్తులు విత్ డ్రా చేసుకోవచ్చు. 16వ తేదీన ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఆ రోజే సాయంత్రం 6గంటల తరువాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.
మొత్తం పది రాష్ట్రాల్లో సుమారు 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఆ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన ఎన్నికలు నిర్వహించనుంది. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా ఏడు మంది రాజ్యసభ ఎంపీలు తమ పదవీకాలాన్ని ఏప్రిల్ 2వ తేదీన పూర్తి చేసుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేఆర్ సురేశ్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏప్రిల్ 9వ తేదీన ఆ ఇద్దరి పదవీకాలం ముగియనుంది.
రాష్ట్రాల వారిగా వివరాలు ఇలా..
మహారాష్ట్రలో ఏడు, ఒడిశా రాష్ట్రంలో నాలుగు, తమిళనాడు రాష్ట్రంలో ఆరు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఐదు, అస్సాం రాష్ట్రంలో మూడు, బిహార్ రాష్ట్రంలో ఐదు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రెండు, హరియాణాలో రెండు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో రెండు స్థానాలకు మొత్తంగా పది రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం







