స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?

- February 19, 2026 , by Maagulf
స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?

యూఏఈ: యూఏఈలో కొన్ని స్కూల్స్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రారంభించనున్నాయి. ప్రతి శుక్రవారం ఆనలైన్ క్లాసులు ఉంటాయని ఇప్పటికే పేరెంట్స్ కు నోటిఫికేషన్లు పంపినట్లు స్కూల్స్ మేనేజ్ మెంట్లు తెలిపాయి.    దీంతో చాలా కుటుంబాలు ఆన్ లైన్ క్లాసులకు అవసరమైన సర్దుబాట్లను చేసుకుంటున్నాయి.    

అయితే, ఆన్ లైన్ లో లెసన్స్ వినే సమయంలో  ఇంట్లో ఇతర పిల్లలు ఉంటే కొద్దిగా కష్టమవుతుందని కొందరు పేరెంట్స్ చెబుతుండగా.. ఇద్దరూ ఉద్యోగం చేసే కుటుంబాలలో ఇది ఇబ్బందిగా మారుతుందని మరికొందరు పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ క్లాసెస్ వల్ల ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. 

అయితే, ఆన్‌లైన్ అభ్యాసం ముఖ్యంగా చిన్న పిల్లలకు కష్టతరంగా ఉంటుందని అమ్నా అల్ షెహి అంటున్నారు. “ఆన్‌లైన్ అభ్యాసం పిల్లలకు చాలా కష్టం. ఒకే స్థాయిలో క్రమశిక్షణ లేనందున వారికి నిరంతర పర్యవేక్షణ అవసరం” అని మరోకరు చెప్పారు. 

మరోవైపు, విద్యార్థులకు అందించే మద్దతును కొందరు పేరెంట్స్ హైలైట్ చేస్తున్నారు. . “దూరవిద్యను సులభతరం చేయడానికి ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు కంప్యూటర్‌లను అందించడంలో యూఏఈ ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ సంవత్సరం నా కుమార్తెకు పాఠశాల ల్యాప్‌టాప్ అందింది. నా కొడుకు పాత దాని స్థానంలో కొత్త కావాలని అడుగుతున్నాడు. అది నాకు అదనపు భారం అవుతోంది.” అని మరో మధర్ తన అనుభవాలను వెల్లడించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com