కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- February 19, 2026
దమ్మామ్: కింగ్ ఫహద్ కాజ్వే అథారిటీ సవరించిన టోల్ ఫీజులను అమలు చేయడం ప్రారంభించింది. అథారిటీ ప్రకటించిన కొత్త రేట్ల ప్రకారం, కార్లు మరియు మోటార్ సైకిళ్లకు టోల్ ఫీజు SR35 కాగా, మినీ బస్సులకు SR55, పెద్ద బస్సులకు SR70 మరియు ట్రక్కులకు టన్నుకు SR7 వసూలు చేయనున్నారు. విద్యార్థులు, దివ్యాంగులు మరియు రోజువారీ తరచుగా ప్రయాణించే వారికి ఈ పెరుగుదల వర్తించదని అథారిటీ పేర్కొంది.
కాజ్వే అథారిటీ ఇటీవల కాజ్వే యాప్ను ఉపయోగించే ప్రయాణికుల కోసం కొత్త ప్యాకేజీలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 18 నుండి అమలులోకి వచ్చేలా టోల్ ఫీజులపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.
కొత్త ప్యాకేజీలలో మూడు ఎంపికలు ఉన్నాయని అథారిటీ వివరించింది. ఫ్రీక్వెంట్ ట్రావెలర్ ప్యాకేజీ టోల్ ఫీజులపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఈ కార్డున్న వార్లు ప్రతిరోజూ బ్రిడ్జిని దాటవచ్చు. ప్యాకేజీ ధర SR850 మరియు ఒక నెల లేదా 40 క్రాసింగ్ల తర్వాత (ఒక మార్గం లేదా తిరిగి) ఏది ముందుగా వస్తే అది చెల్లుబాటలవుతుంది.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?
- భారత్లో టీసీఎస్తో జత కట్టిన OpenAI
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం









