బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం

- February 19, 2026 , by Maagulf
బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం

హైదరాబాద్: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని ఆహ్వానిస్తూ దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈఓ) జే.భవానీ శంకర్, లోక్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గవర్నర్ కి బ్రహ్మోత్సవాల వైభవం, ఆధ్యాత్మిక ప్రాధాన్యం గురించి ఈఓ వివరించారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ మహోత్సవాలకు ప్రముఖులను ఆహ్వానించడం దేవస్థానం సంప్రదాయమని తెలియజేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో నిర్వహించే ఎదురుకోలు మహోత్సవం, స్వామివారి తిరుకల్యాణం, రథోత్సవం వంటి వైభవమైన వేడుకలు భక్తులను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు.

ఈ పవిత్ర బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఆశీస్సులు అందించాలని గవర్నర్ ని ఈఓ ఆహ్వానించారు.గవర్నర్ ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించినట్లు తెలిసింది.

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన మరియు వైభవోపేతమైన ఉత్సవాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ మహోత్సవాలను దర్శించేందుకు హాజరవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com