బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- February 19, 2026
హైదరాబాద్: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని ఆహ్వానిస్తూ దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈఓ) జే.భవానీ శంకర్, లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గవర్నర్ కి బ్రహ్మోత్సవాల వైభవం, ఆధ్యాత్మిక ప్రాధాన్యం గురించి ఈఓ వివరించారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ మహోత్సవాలకు ప్రముఖులను ఆహ్వానించడం దేవస్థానం సంప్రదాయమని తెలియజేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో నిర్వహించే ఎదురుకోలు మహోత్సవం, స్వామివారి తిరుకల్యాణం, రథోత్సవం వంటి వైభవమైన వేడుకలు భక్తులను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు.
ఈ పవిత్ర బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఆశీస్సులు అందించాలని గవర్నర్ ని ఈఓ ఆహ్వానించారు.గవర్నర్ ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించినట్లు తెలిసింది.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన మరియు వైభవోపేతమైన ఉత్సవాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ మహోత్సవాలను దర్శించేందుకు హాజరవుతారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









