బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- February 19, 2026
హైదరాబాద్: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని ఆహ్వానిస్తూ దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈఓ) జే.భవానీ శంకర్, లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గవర్నర్ కి బ్రహ్మోత్సవాల వైభవం, ఆధ్యాత్మిక ప్రాధాన్యం గురించి ఈఓ వివరించారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ మహోత్సవాలకు ప్రముఖులను ఆహ్వానించడం దేవస్థానం సంప్రదాయమని తెలియజేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో నిర్వహించే ఎదురుకోలు మహోత్సవం, స్వామివారి తిరుకల్యాణం, రథోత్సవం వంటి వైభవమైన వేడుకలు భక్తులను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు.
ఈ పవిత్ర బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఆశీస్సులు అందించాలని గవర్నర్ ని ఈఓ ఆహ్వానించారు.గవర్నర్ ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించినట్లు తెలిసింది.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన మరియు వైభవోపేతమైన ఉత్సవాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ మహోత్సవాలను దర్శించేందుకు హాజరవుతారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?
- భారత్లో టీసీఎస్తో జత కట్టిన OpenAI
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం









