దగ్గు మందు మరణాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- February 20, 2026
న్యూ ఢిల్లీ: ఉజ్బెకిస్థాన్, గాంబియా దేశాలలో భారతీయ ఫార్మా సంస్థలు తయారు చేసిన దగ్గు మందులు సేవించి చిన్నారులు మరణించిన ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఔషధాల తయారీకి పాల్పడిన సదరు ఫార్మా సంస్థ, అధికారులపై ధర్మాసనం మండిపడింది. “మీరు కేవలం డబ్బు కోసమే ఈ వ్యాపారం చేస్తున్నారా? మీ స్వార్థం వల్ల అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దెబ్బతింటోంది” అని న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఈ కేసులో ఫార్మా సంస్థ, కొందరు అధికారులపై 2024 జనవరిలో యూపీలోని గౌతమ బుద్ధ నగర్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సమన్లు జారీ చేశారు. అలహాబాద్ హైకోర్టు వీటిని కొట్టివేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మందులలో డై ఇథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనాలు కలవడం వల్ల కిడ్నీలు దెబ్బతిని మరణాలు సంభవిస్తున్నట్లు తేలింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







