తెలంగాణ: వచ్చే నెల నుంచి పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీ..
- February 20, 2026
హైదరాబాద్: తెలంగాణ (TG) ప్రజలకు శుభవార్త. నగరంలో ఇప్పటికే సనత్ నగర్ టిమ్స్ పనులు పూర్తయ్యాయి. వచ్చే నెల ఉగాది సందర్భంగా ఈ హాస్పిటల్ను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీని ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి మల్టీ స్పెషాలిటీ చికిత్సలు ఉచితంగా అందనున్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఉచిత ల్యాబ్ పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చు, క్లిష్టమైన సర్జరీలు ఇక్కడ నిర్వహించనున్నారు.
సనత్ నగర్తో పాటు అల్వాల్లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రి కూడా ప్రారంభానికి సిద్ధమవుతోంది. మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా పరిధిలో సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,196 కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. 12 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో, వెయ్యి పడకల సామర్థ్యంతో ఇది రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం విద్యుత్, ప్లంబింగ్ వంటి తుది దశ పనులు జరుగుతున్నాయి. దీనిని కూడా వచ్చే నెలలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
సుమారు 53 ఎకరాల భారీ విస్తీర్ణంలో రూ.968 కోట్లతో సనత్ నగర్ టిమ్స్ నిర్మాణమైంది. ఇందులో 16 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రోగులతో పాటు వారి సహాయకుల కోసం సెంట్రలైజ్డ్ కిచెన్ సదుపాయాన్ని కల్పించారు. నిమ్స్ (NIMS) నుంచి అనుభవజ్ఞులైన వైద్యులను ఇక్కడికి బదిలీ చేయనున్నారు, తద్వారా 24 గంటల పాటు డాక్టర్ల సేవలు అందుబాటులో ఉంటాయి.
మరోవైపు ఎల్బీ నగర్లో 21 ఎకరాల్లో రూ.1,011 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న టిమ్స్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ ఆసుపత్రులన్నీ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ప్రజలకు మాత్రమే కాకుండా, జిల్లాల నుంచి వచ్చే పేదలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం భారమవ్వదు. రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తి చేస్తోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







