శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- February 23, 2026
తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, సోమవారం సాయంత్రం స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్ రన్ నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంజినీరింగ్, విద్యుత్ అధికారులతో కలిసి తెప్పల సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించారు.
5 రోజుల ఉత్సవాల షెడ్యూల్:
ఈ ఏడాది తెప్పోత్సవాలు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
- తొలిరోజు (ఫిబ్రవరి 26): శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి జలవిహారం (3 చుట్లు).
- రెండో రోజు (ఫిబ్రవరి 27): రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి వారి విహారం (3 చుట్లు).
- చివరి మూడు రోజులు (ఫిబ్రవరి 28 – మార్చి 2): శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు.
- 3వ రోజు: 3 చుట్లు.
- 4వ రోజు: 5 చుట్లు.
- 5వ రోజు (చివరి రోజు): 7 చుట్లు.
రద్దయిన ఆర్జిత సేవలు: తెప్పోత్సవాల కారణంగా భక్తుల రద్దీని దృష్ట్యా టీటీడీ పలు సేవలను రద్దు చేసింది:
ఫిబ్రవరి 26, 27: సహస్రదీపాలంకార సేవ రద్దు.
ఫిబ్రవరి 28, మార్చి 01, 02: ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలు రద్దు చేయబడ్డాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







