ఉచిత వీసా ఉపయోగించి అక్రమ కార్మికుల నియామకం సరి కాదు ఎంపీ
- July 31, 2016
మనామా: ప్రభుత్వ సంస్థలు, కొన్ని మంత్రిత్వశాఖలు అక్రమ కార్మికులు నియామకం కోసం ఉచిత వీసాని ఉపయోగించడం సరికాదని తీవ్రమైన ఆరోపణని ఒక ఎంపీ చేశారు. చట్టం కూడా రాజ్యంలోని కార్మిక చట్టాలను అతిక్రమించినందుకు ఆయా సంస్థలపై చర్యలు తీసుకొంటామని ప్రతిజ్ఞ చేశాయి..కొన్ని ప్రభుత్వ సంస్థలు తమ ప్రాజెక్టులు అమలు చేసుకొనేందుకు ప్రైవేట్ కంపెనీలతో కాంట్రాక్టు కుదుర్చుకొంటున్నారు,. కానీ ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లు ఆయా పనులను పూర్తి చేసుకొనేందుకు అక్రమ ఉద్యోగులు నియామకం జరుపుకొంటున్నారని ఎంపీ ఆడెల్ అల్ అస్సూమి ఒక పత్రికా ప్రకటనలో శనివారం తెలిపారు.
రాజ్యం లోని చట్టాలు మరియు నిబంధనల పట్ల ఇది స్పష్టమైన ఉల్లంఘన అని, చట్టం ఉల్లంఘించినందుకు వారిని పట్టుకొవాలని పిలుపునిచ్చారు, అలాగే జవాబుదారీగా వ్యవహరించని కంపెనీలపై చర్యలు తీయసుకొంటున్నట్లు అల్ అస్సూమి చెప్పారు పార్లమెంటరీ పరిశోధనాత్మక కమిటీ గత సంవత్సరం ఏర్పాటు చేసి ఉచిత వీసా ప్రక్రియను పారదర్శకంగా జరిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వ అధికారులు మరియు ఎస్టాబ్లిషమెంట్స్ చట్టంకు కట్టుబడి ఉండాలని మరియు దేశానికి ఒక సామాజిక మరియు ఆర్థిక ముప్పు ఉచిత వీసా అక్రమమంగా పొందేందుకు సహకరించకూడదని చట్ట రూపకర్తలు వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ పరిశోధనాత్మక కమిటీ ని మార్చి 2015 లో ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో ఎంపీలు అల్ మఃఫోఉద్ , అనాస బూహిండి , హమద్ అల్ డోసరీ, థియబ్ అల్ నురిమి , ఆలీ అల్ ముఖ్ల , మజీద్ అల్ అస్ఫఊర్ , మోహాసేన్ అల్ బేకరీ , ఘాజీ అల్ రహ్మ మరియు నాజర్ అల్ ఖ్అస్సీర్ ఉన్నారు.
తాజా వార్తలు
- అమరావతే రాజధానిగా తీర్మానం..
- కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!!
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు









