లోక్ భవన్‌లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

- February 25, 2026 , by Maagulf
లోక్ భవన్‌లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

విజయవాడ: 'ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్' కార్యక్రమంలో భాగంగా మంగళవారం లోక్ భవన్‌ దర్బార్ హాల్‌లో జరిగిన అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరం రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, అరుణాచల్ ప్రదేశ్‌ అందమైన పర్వతాలు, భౌద్ధ మఠాలు, సరస్సులు మరియు సంస్కృతికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం అని చెప్పారు.మిజోరం రాష్ట్రంలో భారతదేశంలో అత్యధిక సంఖ్యలో తెగలు ఉన్నాయని మరియు, ఆ రాష్ట్రంలో 84.5% అటవీ విస్తీర్ణం ఉందని, ఇది దేశంలోనే అతిపెద్ద వాటిలో ఒకటి అని గవర్నర్ అన్నారు. మిజో ప్రజలు తమ సాంప్రదాయ జానపద నృత్యం చెరా నృత్యానికి ప్రసిద్ధి చెందారని, దీనిని వెదురు నృత్యం అని కూడా పిలుస్తారని, మరియు లయ బద్దంగా నృత్యం చేస్తారని చెప్పారు.

'ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్' కార్యక్రమం వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఆచారాల గురించి తెలుసుకోడానికి వీలు కల్పిస్తుందని, రాష్ట్రాల మధ్య మెరుగైన అవగాహన మరియు దృడమైన బంధానికి వీలు కల్పిస్తుందని, తద్వారా భారతదేశ ఐక్యత మరియు సమగ్రతను బలోపేతం చేస్తుందని గవర్నర్ అన్నారు. 

మిజోరం గవర్నర్ జనరల్ (డాక్టర్) విజయ్ కుమార్ సింగ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ వీడియో సందేశాలతో కార్యక్రమం ప్రారంభమైంది, తరువాత ఐకాన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన రెండు రాష్ట్రాల సాంప్రదాయ జానపద నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  జి.అనంత రాము, జాయింట్ సెక్రటరీ పి.ఎస్.సూర్య ప్రకాష్, లోక్ భవన్ అధికారులు మరియు విజయవాడ మరియు చుట్టుపక్కల విద్యా సంస్థలలో చదువుతున్న మిజోరం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com