జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- February 27, 2026
టెహ్రాన్: అమెరికాతో జరిగిన చర్చల్లో అణు ఫైలు మరియు ఆంక్షల ఎత్తివేతపై మంచి పురోగతి సాధించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తెలిపారు. ఈ చర్చలు ఇప్పటివరకు అత్యంత తీవ్రమైనవిగా అభివర్ణించారు. కొన్ని అంశాలపై ఇరుపక్షాలు ఒప్పందానికి వచ్చాయని, మరికొన్నింటిపై విభేదాలు మిగిలి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. చర్చల సమయంలో ఇరాన్ ప్రతినిధి బృందం తన డిమాండ్లను స్పష్టంగా సమర్పించిందని అబ్బాస్ అరాఘ్చి ధృవీకరించారు. రెండు దేశాల నాయకత్వంతో సంప్రదింపుల తర్వాత తదుపరి రౌండ్ చర్చలు వచ్చే వారం జరగవచ్చని ఆయన పేర్కొన్నారు.
అమెరికా మరియు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల ఎత్తివేత మరియు ఈ విషయంలో అవసరమైన చర్యలకు సంబంధించి ఇరాన్ తన వైఖరిని స్పష్టం చేసిందని అబ్బాస్ అరాఘ్చి తెలిపారు. దౌత్యపరమైన పరిష్కారాన్ని చేరుకోవడంలో అమెరికా మరియు ఇరాన్ రెండూ గతంలో కంటే మరింత ఆప్సెట్ అని తెలిపారు. వియన్నాలో జరగబోయే చర్చలు రెండు వైపుల డిమాండ్లను తీర్చే సాంకేతిక చట్రాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని వివరించారు.
తాజా వార్తలు
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!
- బహ్రెయిన్ లో బ్యాంక్ కార్డ్ ప్రాఢ్..!!
- ఖతార్ లో QR18 బిలియన్లు దాటిన ఆన్లైన్ సేల్స్..!!
- కువైట్ లో ప్రశాతంగా జాతీయ దినోత్సవ వేడుకలు..!!
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు









