రియాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన టెర్మినల్ కెపాసిటీ పెంపు..!!

- February 28, 2026 , by Maagulf
రియాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన టెర్మినల్ కెపాసిటీ పెంపు..!!

రియాద్: రియాద్ లోపి కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెరిగింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 16 నుండి 25 వరకు నిర్వహించిన టెర్మినల్ అప్డేట్ ప్రాజెక్టు పూర్తయింది.  ఇది దేశీయ మరియు అంతర్జాతీయ విమానాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరగడం మరియు దశలవారీ విస్తరణ లక్ష్యాలకు అనుగుణంగా కెపాసిటీని పెంచినట్లు వెల్లడించారు.   

టెర్మినల్స్ 1 మరియు 2 జాతీయ క్యారియర్‌ల అంతర్జాతీయ విమానాల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. టెర్మినల్స్ 3 మరియు 4 జాతీయ క్యారియర్‌ల దేశీయ విమానాల కోసం కేటాయించారు.  టెర్మినల్ 5 విదేశీ క్యారియర్‌ల అంతర్జాతీయ విమానాలకు కేటాయించారు. దీంతో ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందడంతోపాటు వేగంగా ఎగ్జిట్ ప్రక్రియ పూర్తవుతుందని రియాద్ విమానాశ్రయాల సిఇఒ అమాన్ అబు అబా తెలిపారు.

ఎయిర్ పోర్ట్ ప్రస్తుతం7,650 కంటే ఎక్కువ ఫ్లైట్స్ తోపాటు 1,046,016 మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. రాబోయే రోజుల్లో వార్షిక సామర్థ్యాన్ని 16 మిలియన్ల నుండి 25 మిలియన్ల ప్రయాణికులకు పెంచుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం విమానాశ్రయ సామర్థ్యం 2025లో 42 మిలియన్ల ప్రయాణికుల నుండి 2026 చివరి నాటికి 56 మిలియన్లకు పెరుగుతుందని అంచనా  వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com