కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్ మిస్సైళ్లు
- February 28, 2026
ఇరాన్ పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకే ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. భారతీయులు.. ప్రత్యేకించి తెలుగువాళ్లు ఎక్కువగా నివసించే కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైనా దాడులు సాగాయి. బహ్రెయిన్ లో ఏకంగా అమెరికా నావల్ బేస్ సైతం ఇరాన్ సంధించిన శక్తిమంతమైన మిస్సైళ్ల ధాటికి భస్మీపటలం అయింది. ఇరాన్, ఇజ్రాయెల్, బహ్రెయిన్, యూఏఈ, ఖతార్లపై ఏకకాలంలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ల సంయుక్త దాడికి ప్రతీకారంగా ఈ చర్యకు దిగింది. ఈ దాడులు.. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్ గా ఇరాన్(Iran)లోని కీలక స్థావరాలపై దాడులు చేయగా.. దీనికి ప్రతిదాడికి దిగింది ఇరాన్. బహ్రెయిన్లోని యూఎస్ నేవీ బేస్ ను ధ్వంసం చేసిపడేసింది.
ఖతార్ పైనా క్షిపణుల వర్షం కురిసింది ఇరాన్ వైపు నుండి. కొన్ని గంటల తర్వాత ఓ క్షిపణిని ఖతర్ ఇంటర్ సెప్ట్ చేసింది. అబుదాబిలోని యూఎస్ ఎయిర్ బేస్లు, ఖతార్లోని దోహా లక్ష్యం అయ్యాయో లేదో వెంటనే స్పష్టంగా తేలలేదు. అబుదాబిలోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్ను యూఏఈ ఎయిర్ ఫోర్స్, యూఎస్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఉపయోగిస్తున్నాయి. దోహాలోని 24 హెక్టార్ల అల్ ఉదీద్ ఎయిర్ బేస్ యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. ఈ కారణంతో ఇరాన్.. ఆయా దేశాలపై క్షిపణుల దాడులకు పూనుకుంది. అమెరికా బేస్ సెంటర్లే వాటి లక్ష్యం అయినప్పటికీ.. పలు చోట్ల సాధారణ, పౌర, ప్రైవేటు ఆస్తులను నష్టం వాటిల్లినట్లు సమాచారం అందింది. తమ దేశంపై జరిగిన దాడులను బహ్రెయిన్ నిర్ధారించింది. తమ దేశంలోని యూఎస్ నేవీ 5వ బేస్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిగిందని తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









