వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!
- February 28, 2026
వాషింగ్టన్: వాషింగ్టన్లోని వైట్హౌస్లో అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒమన్-అమెరికన్ సంబంధాలపై సమీక్షించారు. రెండు దేశాల మద్య స్నేహ సంబంధాలను మరియు చారిత్రాత్మక, వ్యూహాత్మక బంధాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాబయో రోజుల్లో విభిన్న డొమైన్లలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
అనంతరం ఇరాన్ అణుశక్తి కార్యక్రమం యొక్క శాంతియుత పరిష్కారానికి సంబంధించిన విషయాలపై కీలకంగా చర్చించారు. జరుగుతున్న దౌత్య పరమైన ప్రయత్నాలతో పాటు, ఒమన్ ఆధ్వర్యంలో అమెరికా-ఇరాన్ చర్చలను ఇరువురు సమీక్షించారు. చర్చల్లో నిర్మాణాత్మక ఆలోచనలు మరియు ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. విభేదాలను తగ్గించడానికి మరియు గౌరవప్రదమైన ఒప్పందాన్ని సాధించడానికి తీసుకోవల్సిన అంశాలపై సమీక్షించారని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సమావేశంలో అమెరికా, ఒమన్ కు చెందని మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









