నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- February 28, 2026
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పదవీ బాధ్యతలు స్వీకరించిన జి.సాయి ప్రసాద్ కి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (కనకదుర్గమ్మ ఆలయం) తరపున అర్చకులు అమ్మవారి ఆశీస్సులు అందజేశారు.
ఈరోజు ఉదయం ఏపీ సచివాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా, ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.కె.శీనా నాయక్ నేతృత్వంలోని అర్చక బృందం ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఆలయ స్థానాచార్య వి.శివ ప్రసాద్ శర్మ మరియు ప్రధాన అర్చకులు ఎల్. దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో అర్చక బృందం నూతన సీఎస్కు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీస్సులు అందజేశారు.
ఆలయ ఈఓ వి.కె. శీనా నాయక్ శ్రీ కనకదుర్గ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి, శ్రీ అమ్మ వారి కృపాకటాక్షాలుతో రాష్ట్ర అభివృద్ధిలో సాయి ప్రసాద్ వారి సేవలు విజయవంతం కావాలని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులు, అర్చకులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









