నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- February 28, 2026
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పదవీ బాధ్యతలు స్వీకరించిన జి.సాయి ప్రసాద్ కి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (కనకదుర్గమ్మ ఆలయం) తరపున అర్చకులు అమ్మవారి ఆశీస్సులు అందజేశారు.
ఈరోజు ఉదయం ఏపీ సచివాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా, ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.కె.శీనా నాయక్ నేతృత్వంలోని అర్చక బృందం ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఆలయ స్థానాచార్య వి.శివ ప్రసాద్ శర్మ మరియు ప్రధాన అర్చకులు ఎల్. దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో అర్చక బృందం నూతన సీఎస్కు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీస్సులు అందజేశారు.
ఆలయ ఈఓ వి.కె. శీనా నాయక్ శ్రీ కనకదుర్గ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి, శ్రీ అమ్మ వారి కృపాకటాక్షాలుతో రాష్ట్ర అభివృద్ధిలో సాయి ప్రసాద్ వారి సేవలు విజయవంతం కావాలని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులు, అర్చకులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి









