ఏపీ నూతన సీఎస్గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- March 01, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని ఆయన కార్యాలయంలో టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. ఇప్పటివరకు సీఎస్గా విధులు నిర్వహించిన విజయానంద్ అదే రోజు ఉదయం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో సాయి ప్రసాద్ నియమితులు అయ్యారు.
కొత్త ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్కి సచివాలయంలోని ఉన్నతాధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు శుభాకాంక్షలను వెల్లడించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, ఎంటీ కృష్ణ బాబు, ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, ముఖ్య కార్యదర్శులుకాంతిలాల్ దండే, ముఖేశ్ కుమార్ మీనా తదితరులు విషెస్ అందించారు. సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా మర్యాద పూర్వకంగా కలిసి అభినందలు చెప్పారు. అలాగే 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ సహా పలు కార్పొరేషన్ ఛైర్మన్లు కొత్త సీఎస్ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.
తాజా వార్తలు
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్లో వరుస దాడులు
- ఖతార్ లోని ఇండస్ట్రియల్ ఏరాలో అగ్నిప్రమాదం..!!
- ప్రయాణికులు ఎమిరేట్స్ కీలక సూచనలు..!!
- బ్రేకింగ్: గల్ఫ్ దేశాల్లో రేపటి CBSE పరీక్షలు వాయిదా!
- మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ఉధృతి: విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక
- ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
- దుబాయ్ లో అడ్డగించిన డ్రోన్ల అవశేషాలు ఇళ్ల ఆవరణల్లో పడి ఇద్దరు గాయాలు
- ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు









