సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- March 01, 2026
భారత దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మార్చి 1, 2026 నుంచి “సిమ్ బైండింగ్” (SIM Binding) విధానాన్ని అమలు చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నిబంధన WhatsApp, Telegram, Signal, Snapchat, ShareChat వంటి మెసేజింగ్ యాప్లకు వర్తించవచ్చని చెబుతున్నారు.
ఇప్పటి వరకు ఒకసారి ఫోన్ నంబర్తో వాట్సాప్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత, ఆ సిమ్ కార్డు ఫోన్లో లేకపోయినా యాప్ ఉపయోగించగలిగేవారు. కానీ కొత్త విధానం అమల్లోకి వస్తే, మీరు ఏ నంబర్తో ఖాతా తెరిచారో, ఆ యాక్టివ్ సిమ్ అదే ఫోన్లో ఉండాల్సి ఉంటుంది. సిమ్ లేకపోతే యాప్ పనిచేయదు.
కొత్త నియమాల వల్ల మార్పులు
యాప్ వినియోగం
ఫోన్లో సిమ్ కార్డు తీసేస్తే వెంటనే యాప్ సేవలు నిలిచిపోతాయి. దీంతో హ్యాకర్లు మీ నంబర్ను ఇతర పరికరాల్లో దుర్వినియోగం చేయడం కష్టమవుతుంది.
వెబ్ & డెస్క్టాప్ వినియోగం
వాట్సాప్ వెబ్ లేదా డెస్క్టాప్ ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా కారణాల వల్ల ప్రతి 6 గంటలకు ఆటోమేటిక్ లాగ్ అవుట్ కావచ్చు. మళ్లీ QR కోడ్ స్కాన్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది.
సైబర్ భద్రత మెరుగుదల
ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం, ఈ విధానం ద్వారా సైబర్ నేరాలను గుర్తించడం మరియు నియంత్రించడం సులభమవుతుంది. వినియోగదారుల భద్రత కోసం తీసుకున్న చర్యల్లో ఎటువంటి సడలింపులు ఉండవని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









