యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- March 05, 2026
యూఏఈః యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల అత్యవసర సమావేశంలో ఆపరేషన్స్ రూమ్ అధికారులతో పాటు క్రైసిస్ మేనేజ్ మెంట్ అధికారులు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అబ్దులాజీజ్ అల్ అహ్మద్ ప్రాతినిధ్యం వహించారు.ప్రస్తుత పరిస్థితులు, వివిధ అత్యవసర సవాళ్లను పరిష్కరించడంలో ఉమ్మడి ప్రయత్నాలను సమీక్షించారు.
అలాగే, సభ్య దేశాలలో భద్రతా పరంగా చేపట్టాల్సిన ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. గల్ఫ్ అంతటా సంక్షోభం మరియు అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థల సంసిద్ధతను పెంచే లక్ష్యంతో పనిచేయాలని నిర్ణయించారు. అదే సమయంలో ఎదురవుతున్న అత్యవసర సవాళ్లను పరిష్కరించడానికి సమాచార షేరింగ్ కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







