యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- March 06, 2026
యూఏఈ: యూఏఈలో విమానయాన రంగం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. యూఏఈ బేస్డ్ విమానయాన సంస్థలు పరిమిత షెడ్యూల్ కార్యకలాపాలను ప్రకటించాయి. ప్రాంతీయంగా కొనసాగుతున్న సైనిక సంఘర్షణల మధ్య వైమానిక పరిమితుల కారణంగా దుబాయ్ ప్రధాన క్యారియర్ ఎమిరేట్స్ దాదాపు 100 కంటే ఎక్కువ ఫ్లైట్ షెడ్యూల్ ను ప్రకటించింది.
మార్చి 5 మరియు 6 తేదీల్లో దుబాయ్ నుండి 100 కి పైగా విమానాలు బయలుదేరి తిరిగి వస్తాయని ఎయిర్లైన్ తెలిపింది. అయితే, ప్రయాణికులు ధృవీకరించిన బుకింగ్ కలిగి ఉంటేనే విమానాశ్రయానికి వెళ్లాలని ఎయిర్లైన్ పునరుద్ఘాటించింది. ఫిబ్రవరి 28 మరియు మార్చి 31 మధ్య ప్రయాణించడానికి బుక్ చేసుకున్న ప్రయాణీకులు ఏప్రిల్ 30న లేదా అంతకు ముందు ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ విమానంలో తిరిగి బుక్ చేసుకోవచ్చు అని ఎమిరేట్స్ తెలిపింది.
యూఎస్- ఇజ్రాయెల్ మరియు ఇరాన్లతో యుద్ధం ప్రారంభమైన తర్వాత యూఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాలు తమ వైమానిక ప్రాంతాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో వేలాది మంది ప్రయాణికులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. ఇక దుబాయ్ రెండవ క్యారియర్ ఫ్లైదుబాయ్ కూడా దాని నెట్వర్క్లో తక్కువ షెడ్యూల్తో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.
ఫ్లైదుబాయ్ నెట్వర్క్లో దుబాయ్ ద్వారా కనెక్ట్ అయ్యే ప్రయాణీకులు కనెక్టింగ్ ఫ్లైట్ పనిచేస్తుంటే మాత్రమే వారిని ప్రయాణించడానికి అనుమతిస్తామని ఎయిర్లైన్ తెలిపింది.
అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం (AUH) కూడా అబుదాబి సమన్వయంతో పరిమిత సంఖ్యలో విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. షార్జాకు చెందిన ఎయిర్ అరేబియా విమానాలు కూడా మార్చి 9న మధ్యాహ్నం 3 గంటల వరకు తాత్కాలికంగా నిలిపివేశారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









