యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- March 06, 2026
యూఏఈ: యూఏఈలోని కొన్ని ఇండియన్ సిలబస్ బోధించే స్కూల్స్ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించనున్నాయి. అలాగే, షార్జా తన కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని ఒక వారం వాయిదా వేశాయి. మార్చి 23న ప్రారంభం కావాల్సిన స్కూల్స్.. మార్చి 30న ప్రారంభమవుతాయని ఎమిరేట్లోని ఇండియన్ స్కూల్స్ మేనేజ్ మెంట్లు వెల్లడించాయి.
యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ సమ్మర్ సెలవులను మార్చి 9–22కి మార్చాలని తీసుకున్న నిర్ణయం తరువాత, అనేక భారతీయ స్కూల్స్ తమ అకాడమిక్ ఇయర్ ను సర్దుబాటు చేశాయి.
CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) మరియు CISCE (కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్) పాఠశాలల్లోని సిబ్బంది మరియు విద్యార్థులకు కొత్త ప్రణాలిక వర్తంచనుందని అంబాసిడర్ స్కూల్ షార్జా ప్రిన్సిపాల్ డాక్టర్ ఆరోగ్య రెడ్డి తెలిపారు.
అనేక CBSE మరియు CISCE పాఠశాలలు వారి అకాడమిక్ ఇయర్ ముగింపు దశకు చేరుకున్నందున కొన్ని అసెస్మెంట్లు ఆన్లైన్లోకి మారాయని రాయల్ అకాడమీ అజ్మాన్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ మురళీధర్ తెలిపారు. కాగా, భారతీయ పాఠ్యాంశాలు బోధించే స్కూల్స్ ఇయర్ ఎండ్ సెలవలు భారత్ లోని అకాడమిక్ సెలవులకు సమానంగా ఉండేలా షెడ్యూల్ ఉంటుందని పేర్కొన్నారు.
CBSE పాఠశాలల్లో ఏప్రిల్ నుండి మార్చి వరకు అకాడమిక్ ఇయర్ ను అనుసరిస్తాయని, అంటే ఏప్రిల్ 2026 నుండి మార్చి 2027 వరకు రాబోయే సెషన్కు సిద్ధమవుతాయిని వివరించారు. స్కూల్స్ అధికారిక ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాయని వుడ్లెం పార్క్ స్కూల్ అజ్మాన్ ప్రిన్సిపాల్ భాను శర్మ తెలిపారు.
అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సమ్మర్ సెలవులు మార్చి 9 నుండి మార్చి 22 వరకు కొనసాగుతాయని యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన తరువాత, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ)తో అనుబంధంగా ఉన్న భారతీయ పాఠ్య ప్రణాళిక పాఠశాలలు అధికారులు జారీ చేసిన ఆదేశాలు వర్తిస్తాయా లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉందన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









