మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- March 06, 2026
మనామా: ఇరాన్ దాడులలో బహ్రెయిన్ రాజధాని మనామా దద్దరిల్లింది. ఇరాన్ దాడుల్లో రెండు హోటళ్ళు మరియు ఒక నివాస భవనం దెబ్బతిన్నాయి. స్వల్పాం ఆస్తి నష్టం జరిగిందని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
అయితే అత్యవసర బృందాలు పరిస్థితిని చక్కదిద్దాయని, ప్రభావిత ప్రాంతాలలో వేగంగా స్పందించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చాయని పేర్కొన్నారు. దాడుల్లో దెబ్బతిన్న భవనాల్లోని వారందరినీ సురక్షితంగా ఖాళీ చేయించామని తెలిపారు. సంబంధిత అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని, పౌరులు, నివాసితుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకున్నట్లు వెల్లడించారు.
అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని సూచించారు. ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే సమీపంలోని పోలీసులు, ఇతర సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









