మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- March 06, 2026
మనామా: ఇరాన్ దాడులలో బహ్రెయిన్ రాజధాని మనామా దద్దరిల్లింది. ఇరాన్ దాడుల్లో రెండు హోటళ్ళు మరియు ఒక నివాస భవనం దెబ్బతిన్నాయి. స్వల్పాం ఆస్తి నష్టం జరిగిందని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
అయితే అత్యవసర బృందాలు పరిస్థితిని చక్కదిద్దాయని, ప్రభావిత ప్రాంతాలలో వేగంగా స్పందించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చాయని పేర్కొన్నారు. దాడుల్లో దెబ్బతిన్న భవనాల్లోని వారందరినీ సురక్షితంగా ఖాళీ చేయించామని తెలిపారు. సంబంధిత అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని, పౌరులు, నివాసితుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకున్నట్లు వెల్లడించారు.
అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని సూచించారు. ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే సమీపంలోని పోలీసులు, ఇతర సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







