కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!

- March 06, 2026 , by Maagulf
కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!

కువైట్: కువైట్ వైమానిక ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల ఆ దేశంలో చిక్కుకున్న భారతీయ ప్రయాణీకులతో చర్చలు కొనసాగిస్తున్నామని, వారికి అవసరమైన చర్యలను కొనసాగిస్తున్నామని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

మిడిలీస్టులో నెలకొన్న పరిస్థితుల వల్ల ప్రభావితమైన భారతీయ పౌరులకు మద్దతు ఇవ్వడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నామని తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని రాయబార కార్యాలయం తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

విమానాశ్రయం మూసివేత తర్వాత కొన్ని వందల మంది ట్రాన్సిట్ ప్రయాణికులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. బాధిత ప్రయాణీకులకు కువైట్‌లోని ఒక హోటల్‌లో స్టే ఏర్పాటు చేశారు.  వారు తమ ప్రయాణ ఏర్పాట్ల కోసం ఎదురు చూస్తున్నారు.

కాగా,  పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, సంబంధిత అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నామని అధికారులు తెలిపారు. సాధారణ విమాన కార్యకలాపాలు పునరుద్ధరించబడే వరకు భారతీయ పౌరులకు అవసరమైన సహాయం చేయడం కొనసాగిస్తామని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com