కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- March 06, 2026
కువైట్: కువైట్ వైమానిక ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల ఆ దేశంలో చిక్కుకున్న భారతీయ ప్రయాణీకులతో చర్చలు కొనసాగిస్తున్నామని, వారికి అవసరమైన చర్యలను కొనసాగిస్తున్నామని కువైట్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
మిడిలీస్టులో నెలకొన్న పరిస్థితుల వల్ల ప్రభావితమైన భారతీయ పౌరులకు మద్దతు ఇవ్వడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నామని తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని రాయబార కార్యాలయం తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
విమానాశ్రయం మూసివేత తర్వాత కొన్ని వందల మంది ట్రాన్సిట్ ప్రయాణికులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. బాధిత ప్రయాణీకులకు కువైట్లోని ఒక హోటల్లో స్టే ఏర్పాటు చేశారు. వారు తమ ప్రయాణ ఏర్పాట్ల కోసం ఎదురు చూస్తున్నారు.
కాగా, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, సంబంధిత అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నామని అధికారులు తెలిపారు. సాధారణ విమాన కార్యకలాపాలు పునరుద్ధరించబడే వరకు భారతీయ పౌరులకు అవసరమైన సహాయం చేయడం కొనసాగిస్తామని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









