కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- March 06, 2026
కువైట్: కువైట్ వైమానిక ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల ఆ దేశంలో చిక్కుకున్న భారతీయ ప్రయాణీకులతో చర్చలు కొనసాగిస్తున్నామని, వారికి అవసరమైన చర్యలను కొనసాగిస్తున్నామని కువైట్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
మిడిలీస్టులో నెలకొన్న పరిస్థితుల వల్ల ప్రభావితమైన భారతీయ పౌరులకు మద్దతు ఇవ్వడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నామని తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని రాయబార కార్యాలయం తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
విమానాశ్రయం మూసివేత తర్వాత కొన్ని వందల మంది ట్రాన్సిట్ ప్రయాణికులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. బాధిత ప్రయాణీకులకు కువైట్లోని ఒక హోటల్లో స్టే ఏర్పాటు చేశారు. వారు తమ ప్రయాణ ఏర్పాట్ల కోసం ఎదురు చూస్తున్నారు.
కాగా, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, సంబంధిత అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నామని అధికారులు తెలిపారు. సాధారణ విమాన కార్యకలాపాలు పునరుద్ధరించబడే వరకు భారతీయ పౌరులకు అవసరమైన సహాయం చేయడం కొనసాగిస్తామని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









