కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- March 06, 2026
కువైట్: కువైట్ వైమానిక ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల ఆ దేశంలో చిక్కుకున్న భారతీయ ప్రయాణీకులతో చర్చలు కొనసాగిస్తున్నామని, వారికి అవసరమైన చర్యలను కొనసాగిస్తున్నామని కువైట్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
మిడిలీస్టులో నెలకొన్న పరిస్థితుల వల్ల ప్రభావితమైన భారతీయ పౌరులకు మద్దతు ఇవ్వడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నామని తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని రాయబార కార్యాలయం తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
విమానాశ్రయం మూసివేత తర్వాత కొన్ని వందల మంది ట్రాన్సిట్ ప్రయాణికులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. బాధిత ప్రయాణీకులకు కువైట్లోని ఒక హోటల్లో స్టే ఏర్పాటు చేశారు. వారు తమ ప్రయాణ ఏర్పాట్ల కోసం ఎదురు చూస్తున్నారు.
కాగా, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, సంబంధిత అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నామని అధికారులు తెలిపారు. సాధారణ విమాన కార్యకలాపాలు పునరుద్ధరించబడే వరకు భారతీయ పౌరులకు అవసరమైన సహాయం చేయడం కొనసాగిస్తామని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







