ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- March 06, 2026
దోహా: ఖతార్ లో సైనిక సంఘర్షణలకు సంబంధించిన ఆన్ లైన్ లో తప్పుదారి పట్టించే సమాచారం మరియు పుకార్లను వ్యాప్తి చేసేవారిపై కొరడా ఝులిపిస్తున్నారు. ఈ క్రమంలో వివిధ దేశాలకు చెందిన 194 మంది వ్యక్తులను ఖతార్ సైబర్ క్రైమ్స్ సెల్ అరెస్టు చేసిందని ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
వీడియో క్లిప్లను తీసి ప్రసారం చేయడం మరియు సంబంధిత అధికారులు జారీ చేసిన సూచనలకు విరుద్ధంగా ప్రజాభిప్రాయాన్ని రెచ్చగొట్టడానికి మరియు తప్పుదారి పట్టించే సమాచారం, పుకార్లను ప్రేరేపించేవిధంగా నిందితులు ప్రయత్నించారని వెల్లడించింది.
ప్రజాభిప్రాయాన్ని రెచ్చగొట్టే విధంగా లేదా వారిని తప్పుదారి పట్టించేలా కంటెంట్ లేదా విషయాలను ప్రచురించే ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









