కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- March 06, 2026
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ.. పెరుగుతున్న మొబైల్ వినియోగం వల్ల పిల్లలపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే ఈ నిర్ణయానికి ముఖ్య ఉద్దేశం అని అన్నారు.
పిల్లల్లో సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించాలనే అంశంపై కర్ణాటక ప్రభుత్వం గత కొంతకాలంగా చర్చలు జరుపుతోంది. సీఎం సిద్ధరామయ్య గత నెలలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్లతో జరిపిన చర్చల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్కు సంబంధించి వారి నుంచి అభిప్రాయాలు కోరారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, నిపుణులు, పిల్లల అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా 16ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ విధిస్తూ ప్రకటన చేశారు.
ఆస్ట్రేలియా గత ఏడాది డిసెంబర్ నెలలో 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం అమలు చేసింది. ఆస్ట్రేలియా కంటే ముందే.. అమెరికాలోని పలు రాష్ట్రాలు స్థానిక చట్టాల ద్వారా పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నియంత్రణ చర్యలు చేపట్టాయి. అయితే, ఆస్ట్రేలియా ప్రభుత్వం స్ఫూర్తితో యూరోపియన్ యూనియన్ ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. మరికొన్ని దేశాలు చిన్న పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించేందుకు సిద్ధమవుతున్నాయి.
భారత దేశం విషయానికి వస్తే.. చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ విధించేలా ఆలోచన చేస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆ మేరకు చర్యలు ప్రారంభించామని అన్నారు. అయితే, తాజాగా కర్ణాటక ప్రభుత్వం 16ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచింది.
తాజా వార్తలు
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం







