వాహనదారులకు ఊరట
- March 06, 2026
న్యూ ఢిల్లీ: దేశీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలపై వస్తున్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెరదించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి.
ముడి చమురు పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని ప్రభుత్వం వివరించింది. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, దీనివల్ల దేశీయ మార్కెట్లలో ధరల స్థిరత్వం ఉంటుందని వెల్లడించింది. అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో ఇబ్బందులు ఎదురైనా తట్టుకునేలా భారత్ తగినంత మేర చమురు రిజర్వులను కలిగి ఉందని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా గ్యాస్ మరియు ఆయిల్ సరఫరాకు ఏవైనా అంతరాయాలు ఏర్పడినా దేశానికి ఇబ్బంది ఉండదని కేంద్రం ధీమా వ్యక్తం చేసింది. ముందస్తు ప్రణాళికలతో తగినంత నిల్వలను సిద్ధం చేసుకున్నందున, వినియోగదారులపై ధరల భారం పడే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!









