యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- March 06, 2026
యూఏఈ: గగనతల మూసివేత కారణంగా వేలాది మంది పర్యాటకులు మరియు సందర్శకులు యూఏఈలో చిక్కుకుపోయారు. అయితే, వారికి అవసరమైన వైద్య సహాయం అందించడానికి ఆరోగ్య సంరక్షణ సంస్థలు మరియు పలు కమ్యూనిటీ ముందుకొస్తున్నాయి. కొందరు కన్సల్టెన్సీ సేవలను అందించగా, మరికొందరు అత్యవసర మందులు మరియు పరీక్షలను అందించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఉమ్ హురైర్లోని పాకిస్తాన్ అసోసియేషన్ ప్రాంగణంలో ఉన్న పాకిస్తాన్ మెడికల్ సెంటర్ (PMC), ఇటీవలి గగనతల మూసివేతల కారణంగా చిక్కుకుపోయిన ప్రయాణీకులకు ఉచిత వైద్య సహాయం అందిస్తోంది. PMC మెడికల్ డైరెక్టర్ డాక్టర్ నసీమ్ సబీర్ మాట్లాడుతూ.. వైద్య సహాయం అవసరమైన ఏ ప్రయాణికుడికైనా కేంద్రాన్ని సంప్రదించడవచ్చని తెలిపారు.
"దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వారి మందులు అందుబాటులో ఉండకపోవచ్చు లేదా కొంతమందికి కాలానుగుణ ఫ్లూ రావచ్చు" అని డాక్టర్ సబీర్ వివరించారు. అలాంటి వారు PMC కి రావచ్చని సూచించారు. తమకు 37 స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయని, అవి వారంలో ఏడు రోజులు ఉదయం 8.30 నుండి రాత్రి 9.30 వరకు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. అన్ని చికిత్స ఖర్చులను భరించడానికి కేంద్రం ప్రత్యేక నిధిని కేటాయించిందన్నారు. ఉచిత కన్సల్టెన్సీ సేవలతోపాటు బల్డ్ పరీక్షలు, ఎక్స్-రేలు, అల్ట్రాసౌండ్ పరీక్షలను పొందవచ్చని తెలిపారు. 2020లో ప్రారంభించబడిన PMC యూఏఈ సమాజానికి "బహుమతి" అని డాక్టర్ సబీర్ అభివర్ణించారు. ఇది ప్రభుత్వం మరియు దుబాయ్ హెల్త్ అథారిటీ మద్దతుతో నడుస్తుందని అన్నారు. యూఏ టాప్ ఆసుపత్రుల నుండి 62 మంది వైద్యులు స్వచ్ఛందంగా సేవలు అందిస్తారని పేర్కొన్నారు.
కమ్యూనిటీ గ్రూపులతో పాటు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు దేశంలో చిక్కుకున్న ప్రయాణీకులకు ఉచిత లేదా రాయితీ సేవలను కూడా అందిస్తున్నట్లు గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు తుంబే మొయిదీన్ తెలిపారు. వైద్య సంరక్షణ అవసరమైన ఏ పర్యాటకుడికైనా మద్దతు ఇవ్వడానికి తమ బృందాలు సిద్ధంగా ఉంటాయని అన్నారు.
తాజా వార్తలు
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం









